News June 11, 2024
కర్నూలు: 19న జడ్పీ సర్వసభ్య సమావేశం

జడ్పీ సర్వసభ్య సమావేశం 19వ తేదీ ఉదయం 11 గంటలకు ఛైర్మన్ అధ్యక్షతన నిర్వహించను న్నట్లు సీఈవో జి.నాసర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, నీటి పారుదల శాఖలపై సమీక్షించనున్నట్లు చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు.
Similar News
News October 23, 2025
3వ విడత రీ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి: సీసీఎల్ఏ

సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రకారం ఇళ్లు లేని వారికి ఇళ్లు కల్పించడానికి అన్ని జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ జయలక్ష్మి ఆదేశించారు. 3వ విడత రీ సర్వే పనులను త్వరగా పూర్తి చేయాలని, హౌసింగ్ సంబంధిత సమస్యలను సమీక్షించాలని సూచించారు. దీనికి సంబంధించిన నివేదిక సమర్పిస్తామని కర్నూలు కలెక్టర్ డా. ఏ.సిరి తెలిపారు.
News October 22, 2025
2 కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు: జిల్లా జడ్జి

రెండు కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది పేర్కొన్నారు. బుధవారం కర్నూలు, నంద్యాల కలెక్టర్లు, ఎస్పీలతో విక్టిమ్ కాంపెన్సేషన్, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ, హిట్ అండ్ రన్ కేసులపై సమీక్ష నిర్వహించారు. రెండు కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు చేశారు. ఆధార్ లేని 125 అనాథ పిల్లల్లో 56 మందికి ఆధార్ కార్డులు జారీ చేశారు.
News October 22, 2025
చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేయాలి: కలెక్టర్

జిల్లాలోని చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేసి చట్టవిరుద్ధంగా ఉన్న వాటిని రద్దు చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. సంస్థలకు వచ్చిన నిధులు, ఖర్చులు, మౌలిక వసతుల వివరాలు సమగ్రంగా ఇవ్వాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల నియంత్రణపై చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.