News April 24, 2024

కర్నూలు: 3 రోజులు పనికి, మరో 3 రోజులు బడికి.. టెన్త్‌లో 509 మార్కులు

image

పదో తరగతి ఫలితాల్లో చిప్పగిరి మండలం బంటనహాల్‌కు చెందిన నవీన అనే విద్యార్థిని 509 మార్కులు సాధించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కెల్లా ఇవే అత్యధిక మార్కులు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక నవీన వారంలో 3 రోజులు కూలీ పనులకు, మరో 3 రోజులు పాఠశాలకు వెళ్లేదని స్థానికులు తెలిపారు. నవీన తండ్రి వ్యవసాయ కూలీ కాగా, ఆమె తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతోందని తెలిపారు.

Similar News

News January 16, 2025

BREAKING: కాటసాని అనుచరులపై మంత్రి బీసీ అనుచరుల దాడి

image

బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాటసాని రామిరెడ్డి అనుచరుడు మొహమ్మద్ ఫైజ్ కుటుంబంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారంటూ పోలీస్ స్టేషన్‌లో రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫైజ్ కుమారుడి వివాహంలో కెమెరామెన్లు డ్రోన్లతో షూట్ చేస్తుండగా మంత్రి కాంపౌండ్‌‌లోకి డ్రోన్ వెళ్లిందంటూ కెమెరామెన్లను కొట్టారని, అదే సమయంలో ఫైజ్ కుటుంబంపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News January 15, 2025

కర్నూలు: కవలల ఇంట సంక్రాంతి కాంతులు

image

ఒకేసారి కవలలు అంటే కాస్త ఆశ్చర్యం, కానీ రెండోసారి కవల పిల్లలంటే అద్భుతమే అని చెప్పాలి. కర్నూలు జిల్లా నందవరం గ్రామానికి చెందిన ఫక్కీరప్ప, కృపావతి దంపతులు మొదట ఇద్దరు ఆడపిల్లలు, రెండోసారి ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. అమ్మాయిల పేర్లు స్నేహ, శ్వేత కాగా అబ్బాయిల పేర్లు అఖిల్, నిఖిల్‌గా నామకరణం చేశారు. కవల పిల్లలతో సంక్రాంతిని సంతోషంగా జరుపుకున్నామని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

News January 15, 2025

పండగ రోజు విషాదం.. వెల్దుర్తిలో చిన్నారి మృతి

image

కర్నూలు బెంగళూరు 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయ. గిరి (10) అనే బాలుడు దుర్మరణం చెందాడు. వెల్దుర్తి ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు, కళ్యాణిల కుమారుడు గిరి రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యప్తు చేపట్టారు.