News June 24, 2024
కర్నూల్ కొత్త కలెక్టర్ గురించి ఈ విషయాలు తెలుసా..

కర్నూల్ జిల్లా కలెక్టర్గా నియమితులైన రంజిత్ బాషా 2018లో పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్న నారా లోకేశ్ వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వమే ఆయనకు కలెక్టర్గా పదోన్నతి కల్పించింది. ఇక బాల్యంలో ఆయన విద్యాభ్యాసం జిల్లాలోనే సాగింది. నందికొట్కూరులోని సంతపేట పాఠశాల, ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని ఏపీ గురుకులం, నందికొట్కూరు ప్రభుత్వ కళాశాలల్లో 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివారు.
Similar News
News November 25, 2025
కర్నూలు: ‘విద్యార్థుల హృదయాలను గెలిచారు’

కర్నూలు డీఈవో శామ్యూల్ పాల్ మరోసారి తనదైన శైలిలో విద్యార్థుల హృదయాలను గెలిచారు. మంగళవారం క్రిష్ణగిరి మండలంలోని పలు విద్యాలయాలను ఆయన తనిఖీ చేశారు. క్రిష్ణగిరిలోని ఓ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థికి స్వయంగా గోరుముద్దలు తినిపించారు. అనంతరం కేజీబీవీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఫలితాలలో మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.
News November 25, 2025
కర్నూలు SP స్పందనకు 95 ఫిర్యాదులు

కర్నూలులో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 95 ఫిర్యాదులు స్వీకరించినట్టు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజలను ప్రత్యక్షంగా కలసి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ, పోలీసు అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News November 25, 2025
కర్నూలు SP స్పందనకు 95 ఫిర్యాదులు

కర్నూలులో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 95 ఫిర్యాదులు స్వీకరించినట్టు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజలను ప్రత్యక్షంగా కలసి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ, పోలీసు అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


