News August 21, 2024

కర్నూల్.. మరణంలోనూ వీడని బంధం

image

బండి ఆత్మకూరు మండలం వెంగళరెడ్డిపేటలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న చిన్న తిరుపాలు (75) ఉదయం అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన మృతితో భార్య అక్కమ్మ రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. సాయంత్రం తిరుపాలును అంత్యక్రియల నిమిత్తం తీసుకెళ్తుండగా భార్య అక్కమ్మ(69) గుండెపోటుకు గురై మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News November 10, 2025

కర్నూలు జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు: ఎస్పీ

image

కర్నూలు జిల్లాలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదివారం జిల్లాలో నేర నియంత్రణకు పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గస్తీలు, తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

News November 9, 2025

కర్నూలులో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

కర్నూలులోని నిర్మల్ నగర్‌‌లో ఆదివారం విషాదం నెలకొంది. కాలనీకి చెందిన భరత్ కుమార్(21) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే సెమిస్టర్ పరీక్షలు రానున్నాయనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

News November 9, 2025

ఈనెల 11న సీఎం వర్చువల్ శంకుస్థాపనలు: కలెక్టర్

image

జిల్లాలో పలు ప్రాజెక్టులకు ఈ నెల 11న సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆర్డీవోలు, ఏపీఐఐసీ, ఎయిర్‌పోర్ట్, టూరిజం అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి లబ్ధిదారులు, స్టేక్‌హోల్డర్లతో నేరుగా మాట్లాడే అవకాశం ఉండేలా సక్రమ ఏర్పాట్లు చేయాలని సూచించారు.