News October 12, 2024
కర్రల సమరానికి సిద్ధమైన ‘దేవరగట్టు’

హోళగుంద మండల పరిధిలోని దేవరగట్టు కర్రల సమరానికి సిద్ధమైంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కర్రల సమరం వీక్షించేందుకు పల్లెజనం ఇప్పటికే భారీగా దేవరగట్టు చేరుకున్నారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా బన్నీ ఉత్సవాలకు ఎస్పీ బిందు మాధవ్ 800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 5 డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు.
Similar News
News December 13, 2025
కర్నూలు జిల్లాలో 8,781 కేసులు నమోదు: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేస్తున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 11 వరకు 8,787 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే ఒక నెల జైలుశిక్ష కూడా విధిస్తామని ఎస్పీ హెచ్చరించారు. ప్రయాణికుల భద్రత కోసం ట్రాఫిక్ నియంత్రణను బలోపేతం చేసినట్లు ఆయన చెప్పారు.
News December 13, 2025
నేడు కర్నూలుకు మంత్రి ఆనం రాక

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేడు కర్నూలుకు రానున్నారు. కర్నూలు నగర శివారులోని అనంతపురం రోడ్డులో దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నూతన భవన కార్యాలయాన్ని ఉదయం 11.50 గంటలకు మంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి కార్యాలయ వర్గాలు ఆయన పర్యటన వివరాలను వెల్లడించాయి.
News December 13, 2025
నేడు కర్నూలుకు మంత్రి ఆనం రాక

రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నేడు కర్నూలుకు రానున్నారు. కర్నూలు నగర శివారులోని అనంతపురం రోడ్డులో దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నూతన భవన కార్యాలయాన్ని ఉదయం 11.50 గంటలకు మంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి కార్యాలయ వర్గాలు ఆయన పర్యటన వివరాలను వెల్లడించాయి.


