News February 8, 2025
కర్రివలసలో వ్యక్తి ఆత్మహత్య

పాచిపెంట మండలం కర్రివలస గ్రామంలో దాసరి శంకరరావు(35) ఆత్మహత్య చేసుకున్నారని ఏఎస్సై బి.ముసలినాయుడు తెలిపారు. శనివారం మాట్లాడుతూ.. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా శంకరరావు శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసి విజయనగరం మహారాజ ఆసుపత్రికి రిఫర్ చేశారని, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News November 11, 2025
పెదగంట్యాడలో ఎంఎస్ఎంఈ పార్క్కు శంకస్థాపన

రాష్ట్రంలో ప్రతి ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం పెదగంట్యాడలో ఎం.ఎస్.ఎం.ఈ పార్క్కి మంత్రులు డీఎస్ బీవీ స్వామి, వాసంశెట్టి సుభాష్, ఎంపీ శ్రీ భరత్ శంఖుస్థాపన చేశారు. ఒకే రోజు రాష్ట్రంలో 27 ఎం.ఎస్.ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయడం చారిత్రాత్మక ఘట్టం అన్నారు.
News November 11, 2025
పాక్లో ఆత్మాహుతి దాడి వెనుక భారత్: షరీఫ్

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్పై విషం కక్కారు. ఇస్లామాబాద్లో జరిగిన <<18258453>>ఆత్మాహుతి దాడి<<>> వెనుక ఇండియా ఉందంటూ ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో ఢిల్లీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. అఫ్గాన్ కేంద్రంగా పనిచేసే TTP భారత్ ఆడించే తోలుబొమ్మ అని అక్కసు వెళ్లగక్కారు. ఇది అనేక మంది చిన్నపిల్లలపై దాడులు చేస్తోందని, దీన్ని ఎంత ఖండించినా సరిపోదంటూ మొసలి కన్నీళ్లు కార్చారు.
News November 11, 2025
SRCL: ATCతో యువతకు ఉపాధి అవకాశాలు

అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ATC)తో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ఏటీసీ కేంద్రాన్ని ఆమె మంగళవారం పరిశీలించారు. CNC మ్యాచింగ్ టెక్నీషియన్, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రీయల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ కోర్సులను ఉపయోగించుకోవాలన్నారు.


