News February 8, 2025
కర్రివలసలో వ్యక్తి ఆత్మహత్య

పాచిపెంట మండలం కర్రివలస గ్రామంలో దాసరి శంకరరావు(35) ఆత్మహత్య చేసుకున్నారని ఏఎస్సై బి.ముసలినాయుడు తెలిపారు. శనివారం మాట్లాడుతూ.. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా శంకరరావు శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసి విజయనగరం మహారాజ ఆసుపత్రికి రిఫర్ చేశారని, అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారన్నారు. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News February 8, 2026
MDK: BJP ఛైర్మన్ ఉంటేనే కేంద్ర నిధులు ఆగం కావు: MP

మున్సిపాల్ ఛైర్మన్ పోస్టులో బీజేపీ అభ్యర్థులు కూర్చుంటేనే కేంద్రం నిధులు ఆగం కాకుండా అభివృద్ధి చేస్తారని MP రఘునందన్ రావు అన్నారు. ఆదివారం మెదక్ పార్లమెంట్ పరిధిలోని గుమ్మడిదలలో మున్సిపల్ ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధికి నిధులు ఇచ్చేది కేంద్రమే అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ప్రజల కష్టాలు తీరుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.
News February 8, 2026
ప్రతి తప్పుకు శిక్ష ఉంటుంది!

గరుడ పురాణం ప్రకారం మనం చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. పాపపుణ్యాల తీవ్రతను బట్టి నరకంలోని శిక్షలు ఉంటాయి. స్వర్గంలోని లోకాలు మారుతుంటాయి. ఈ లోకాలు భువర్లోకం నుంచి సత్యలోకం వరకు ఉంటాయి. జ్ఞానం, భక్తి, త్యాగాల ద్వారా వైకుంఠం, కైలాసం వంటి ఉన్నత స్థితిని పొందవచ్చు. స్వర్గనరకాలు మనం ఎంచుకున్న మార్గాలేనని, జీవితం పరీక్ష అయితే ‘కర్మ’ తుది తీర్పు అని ఈ పురాణం హెచ్చరిస్తోంది. సత్కర్మలే సద్గతికి ఆధారం.
News February 8, 2026
బర్డ్ ఫ్లూపై ప్రజల్లో ఆందోళన వద్దు: అన్నమయ్య కలెక్టర్

అన్నమయ్య జిల్లా సదుం మండలంలోని కోళ్ల ఫారాలలో గుర్తించిన బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. సదుంలోని పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లెలోని 2 కోళ్ల ఫారాలలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో కోళ్లను ఖననం చేయడానికి కలెక్టర్ పశుసంవర్ధక శాఖకు ఆదేశించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.


