News February 24, 2025

కర్లపాలెం: విద్యుత్ ఘాతంతో రైతు మృతి

image

విద్యుత్ ఘాతానికి గురై రైతు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. కర్లపాలెం మండలం తిమ్మారెడ్డిపాలెం సమీపంలో కొత్త నందాయపాలెంకి చెందిన రైతు సుబ్బారెడ్డి మిర్చి పొలంలో నీరు పెట్టేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో బోరు స్విచ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News January 4, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన నవీన్ రావు విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు సిట్ విచారణ ముగిసింది. సుమారు 7 గంటలకు పైగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. SIB మాజీ అధికారులతో సంబంధాలపై ఆరా తీశారు. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే వేధిస్తున్నారని విచారణ అనంతరం నవీన్ రావు ఆరోపించారు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని, ఇది బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న దాడి అని అభివర్ణించారు.

News January 4, 2026

BCB రిక్వెస్ట్.. శ్రీలంకలో బంగ్లా మ్యాచులు!

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు ఇరు దేశాల మధ్య <<18748860>>క్రికెట్‌పై<<>> ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో T20WCలో తమ మ్యాచులు భారత్‌ నుంచి మార్చాలని BCB రిక్వెస్ట్ చేసింది. దీనిపై ICC సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్ స్టేజ్‌లో భారత్‌లో జరగాల్సిన బంగ్లా మ్యాచులను శ్రీలంకకు మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే 48గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని క్రిక్ బజ్ పేర్కొంది.

News January 4, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

♦︎బారువ హైవేపై రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
♦︎SKLM: 108పై దుష్ప్రచారాలు మానుకోవాలి
♦︎దేశంలో మొదటిసారిగా ఏపీలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గింపు: అచ్చెన్న
♦︎టెక్కలి: మద్యం మత్తులో చనిపోతానంటూ వ్యక్తి హల్‌చల్
♦︎కంచిలి: రైలు పైకెక్కి వ్యక్తి హల్‌చల్
♦︎ఉత్తరాంధ్ర అభివృద్ధికి బీజం పడింది: రామ్మెహన్
♦︎ పొందూరులో నూతన డీటీఎఫ్ కార్యవర్గం ఎంపిక