News February 7, 2025

కర్లపాలెం PSను తనిఖీ చేసిన ఎస్పీ

image

కర్లపాలెం పోలీస్ స్టేషన్‌ను బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హెల్మెట్ అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News November 21, 2025

జొమాటో, స్విగ్గీ కస్టమర్లకు షాక్!

image

తమ కస్టమర్ల డేటాను లక్షలాది రెస్టారెంట్లతో పంచుకోవాలని జొమాటో, స్విగ్గీలు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే జొమాటో పైలట్ ప్రాజెక్టు కింద ‘పర్మిషన్’ పాప్ అప్ మెసేజ్‌లను పంపుతోంది. దానిపై క్లిక్ చేస్తే మీ డేటా రెస్టారెంట్లకు చేరుతుంది. త్వరలో ఆటోమేటిక్‌ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇకపై అన్‌వాంటెడ్ మెసేజ్‌లు ఇన్‌బాక్స్‌లను ముంచెత్తనున్నాయి. అలాగే డేటా గోప్యతకు భంగం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.

News November 21, 2025

FEB 15న భారత్-పాకిస్థాన్ మ్యాచ్?

image

వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌లో మరోసారి భారత్-పాక్ తలపడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని క్రీడా వర్గాలు తెలిపాయి. IND సెమీస్‌కు క్వాలిఫై అయితే వాంఖడేలో మార్చి 5న ప్రత్యర్థితో మ్యాచ్ ఆడనుందని పేర్కొన్నాయి. అలాగే FEB 7న టోర్నీ ప్రారంభమై అహ్మదాబాద్‌లో మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుందని వెల్లడించాయి. ఇటీవల T20IWC <<18244536>>వేదికలను<<>> ఖరారు చేసిన విషయం తెలిసిందే.

News November 21, 2025

JNTU అభివృద్ధికి సహకరించండి: VC

image

80 ఎకరాల్లో విస్తరించి ఉన్న కూకట్‌పల్లి జేఎన్టీయూ ప్రాపర్టీ టాక్స్‌తో పాటు లీజు చెల్లింపులు లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క‌ను వర్సిటీ వీసీ కిషన్ కుమార్ రెడ్డి కోరారు. ఎంతో మంది విద్యార్థులను JNTU తీర్చి దిద్దిందని, ఎంతో మందికి జీవితాన్నించిందని వెల్లడించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేసి అభివృద్ధికి తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు.