News June 28, 2024

కలకలం రేపుతున్న పెద్దిరెడ్డి సిఫార్సు లేఖ

image

గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి దర్శనం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంపిన లేఖ కలకలం రేపుతోంది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో ఒకేసారి 54 మందిని పంపించాలని రాసిన సిఫారసు లేఖపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే బ్రేక్ దర్శనం స్కాం పైనా, శ్రీవాణి ట్రస్ట్ నిధుల మళ్లింపుపైనా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Similar News

News September 21, 2024

తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

image

పెట్రోల్ బంకు క్లియరెన్స్‌లో లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డిను సస్పెండ్ చేస్తున్నట్లు రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. పుత్తూరు పెట్రోల్ బంకు ఎన్ఓసీకి రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. విచారణలో నిజమని తేలడంతో ఆయనపై వేటు వేసింది.

News September 20, 2024

సదుం: నాలుగేళ్ల చిన్నారి మృతి

image

అనారోగ్యంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన సదుం మండలంలో శుక్రవారం జరిగింది. జాండ్రపేటకు చెందిన షేహాన్ షా కుమార్తె సభా పర్వీన్ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ పీలేరులో చికిత్స పొందింది. ఈ క్రమంలో నేడు మళ్లీ చిన్నారి హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

News September 20, 2024

బంగారుపాళ్యం నుంచే దండయాత్రగా మారింది: లోకేశ్

image

కుప్పం నుంచి చేపట్టిన తన యువగళం యాత్ర బంగారుపాళ్యం నుంచి దండయాత్రగా మారిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళాన్ని అడ్డుకునేందుకు ఆనాటి ప్రభుత్వం జీవో తెచ్చి అడ్డంకులు సృష్టించింది. అయినా భయపడలేదు. నాపై 23 కేసులు నమోదు చేశారు. పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సూపర్-6 పథకాలు ఉపయోగపడతాయి. సీఎం చంద్రబాబుతో చర్చించి వాటిని అమలు చేస్తా’ అని లోకేశ్ చెప్పారు.