News August 22, 2024
కలసపాడు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
కలసపాడు మండలం ఎగువరామాపురం పంచాయితీ తంబళ్లపల్లెకు చెందిన ఇద్దరు యువకులు బుధవారం పోరుమామిళ్ల మలకత్తువ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై కడప రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన సాయి కుమార్ రెడ్డి, తరుణ్ కుమార్ రెడ్డి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోరుమామిళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 30, 2024
కడప జిల్లాలో బాంబు పేలుడు.. VRA మృతి
కడప జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో బాంబులు కలకలం రేపాయి. స్థానిక VRA వి నరసింహులు ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు వేయడంతో VRA మృతి చెందగా భార్యకు గాయాలయ్యాయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
News September 30, 2024
కడప: నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నేటి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 08562-24437 ల్యాండ్ లైన్ నంబర్కు ప్రజలు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
News September 30, 2024
రాజంపేట: ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి బంగారు పతకం
రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థి కౌశిక్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పథకం సాధించినట్లు జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. హరియాణా రాష్ట్రంలో నిర్వహించిన సబ్ జూనియర్ నేషనల్ బాల్ బ్యాడ్మింటన్ ఆటల పోటీల కార్యక్రమంలో విద్యార్థి పాల్గొన్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉమ్మడి కడప జిల్లా విద్యార్థి బంగారు పతకం సాధించారని సంతోషం వ్యక్తం చేశారు.