News January 28, 2025
కలికిరి: స్టేట్ లెవెల్ రిపబ్లిక్ డే పెరేడ్లో JNTU విద్యార్థుల ప్రదర్శన

స్థానిక కలికిరి JNTU విద్యార్థులు నిన్న విజయవాడలో జరిగిన స్టేట్ లెవెల్ రిపబ్లిక్ డే పెరేడ్ (SLRDC-2025)లో ప్రదర్శన కనబరచినట్లు ప్రిన్సిపల్, M. వెంకటేశ్వరరావు తెలిపారు. శరత్ కుమార్(EEE), ఢిల్లీ ప్రసాద్ (EEE), క్రిష్ణ (EEE), హరి (ECE), గురు హర్షిత్(ME) పాల్గొన్నారన్నారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసినట్లు NSS కోఆర్డినేటర్ డా. K. అపర్ణ తెలిపారు.
Similar News
News November 12, 2025
HYD: రాష్ట్రంలో కాంగ్రెస్కి ఢోకా లేదు: TPPC

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, టీపీసీసీగా తామే ఉంటామని చిట్చాట్లో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై స్టడీ చేస్తామన్నారు. కాంగ్రెస్ మరో 10ఏళ్లు అధికారంలో ఉంటుందని, ఏ ఎలక్షన్ వచ్చినా గెలిచేది కాంగ్రెస్ అన్నారు.
News November 12, 2025
VZM: హోంగార్డ్స్ పిల్లలకు స్కాలర్షిప్లు

2023-24 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 16మంది హెూంగార్డ్స్ పిల్లలకు రూ.2000 చొప్పున మెరిట్ స్కాలర్షిప్లు జిల్లా ఎస్పీ దామోదర్ తన కార్యాలయంలో నేడు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉన్నత విద్యతోనే భవిష్యత్తు బలపడుతుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు. హెూంగార్డ్స్ సంక్షేమం కోసం ఇలాంటి ప్రోత్సాహకాలు కొనసాగుతాయని తెలిపారు.
News November 12, 2025
వనపర్తి: నూతన ఇన్ఛార్జ్ DMHOగా సాయినాథ్ రెడ్డి

వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ డీఎంహెచ్ఓ (జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి)గా జిల్లా టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీబీ డిపార్ట్మెంట్ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ భాషిత్ ఖాన్, టెక్నీషియన్ మధు, కాంగ్రెస్ అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం వినోద్ యాదవ్ తదితరులు ఆయనను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.


