News April 6, 2025

కలిదిండి: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి

image

ఎలుకల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలిదిండి మండలం పడమటిపాలెం గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ఈ నెల 3న మద్యం తాగి ఇంటికి వచ్చి వాంతులు చేసుకున్నాడు. మద్యం మానేయాలని భార్య మందలించడంతో మనస్తాపానికి గురై 4వ తేదీన ఎలుకల మందుని నీళ్లలో కలుపుకుని తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

Similar News

News October 18, 2025

DDAలో 1,732 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ 1,732 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష(స్టేజ్1, స్టేజ్ 2), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, Jr ఇంజినీర్, SO, స్టెనోగ్రాఫర్, JSA, మాలి, MTS తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://dda.gov.in/. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 18, 2025

వివరాలు ఇవ్వకపోతే ఈనెల జీతం రాదు: ఆర్థిక శాఖ

image

TG: ఆధార్, ఫోన్ నంబర్లను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయని ఉద్యోగులకు ఈనెల జీతం రాదని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలను అరికట్టేందుకు సమగ్ర సమాచారం కోసం ప్రతినెల 10లోపు ఉద్యోగుల ఆధార్, ఫోన్ నంబర్లను నమోదు చేయాలని గతనెల ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు 5.21లక్షల రెగ్యులర్ ఉద్యోగుల్లో 2.22లక్షల మంది, 4.93లక్షల ఒప్పంద సిబ్బందిలో 2.74లక్షల మంది మాత్రమే వివరాలు అందించారు.

News October 18, 2025

వికారాబాద్ బీజేపీ అధ్యక్షుడి రాజీనామా ఆమోదం

image

VKB జిల్లా బీజేపీ అధ్యక్షుడి రాజీనామాను బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆమోదించారు. జిల్లా పార్టీ కన్వీనర్ ప్రహ్లాదరావును అధ్యక్షుడిగా నియమించారు. చేవేళ్ల ఎంపీగా ఉన్న తనకు తెలియకుండానే జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని జిల్లా అధ్యక్షుడిపై నాయకత్వానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. వివధ వేదికలపై ఒత్తిడి తేవడంతో చర్యలు అనివార్యమయ్యాయి. దీంతో కొండా పంతం నెగ్గినట్లైంది.