News March 20, 2025
కలిదిండి: గేట్లో 9వ ర్యాంకు సాధించిన సాయిచరణ్

కలిదిండి(M) ఆరుతెగలపాడు గ్రామానికి చెందిన చిలుకూరి సాయిచరణ్ ఆల్ ఇండియా గేట్ ప్రవేశ పరీక్షలో 9వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. గతేడాది కాకినాడ JNTUలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన సాయిచరణ్.. గేట్ ప్రవేశ పరీక్ష కోసం హైదరాబాద్లో శిక్షణ తీసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే 9వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని సాయిచరణ్ తెలిపారు. ఐఐటీ చదవాలన్న తన ఆశయానికి తండ్రి కిశోర్, తల్లి పల్లవి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారన్నారు.
Similar News
News December 3, 2025
తులసి కోట వద్ద నిత్య దీపారాధన ఎందుకు చేయాలి?

తులసి కోట వద్ద నిత్యం దీపం వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా ఇంటి నిండా సానుకూల శక్తి ప్రవహిస్తుందని చెబుతున్నారు. ఈ దీపం మన పరిసరాలను శుద్ధి చేసి మనలో పాజిటివ్ ఆలోచనలు కలిగేలా చేస్తుందని అంటున్నారు. ‘లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఉంటారు. సంపద, శ్రేయస్సు, అదృష్టం పెరిగే యోగం కూడా ఉంటుంది’ అని వివరిస్తున్నారు.
News December 3, 2025
స్మృతి మంధాన పెళ్లి కొత్త డేట్ ఇదేనా?

స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ పెళ్లి వాయిదా పడిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో తొలుత స్మృతి తండ్రి, ఆపై పలాశ్ ఆస్పత్రుల్లో చేరి డిశ్ఛార్జ్ అయ్యారు. కాగా పెళ్లికి కొత్త డేట్ ఫిక్స్ అయిందని, DEC 7న వివాహం జరగనుందని SMలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్మృతి బ్రదర్ శ్రవణ్ స్పందిస్తూ.. ‘ప్రస్తుతానికి పెళ్లి వాయిదా పడింది. కొత్త డేట్ గురించి మేము ప్రకటించలేదు. ప్రచారంలో ఉన్న డేట్ రూమర్ మాత్రమే’ అని చెప్పారు.
News December 3, 2025
సరికొత్త ఆవిష్కరణలకు పట్టం కట్టాలి: పవన్

AP: సరికొత్త ఆవిష్కరణలకు పట్టం కట్టాలని, ఆవిష్కర్తలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని Dy.CM పవన్ అన్నారు. అవసరమైతే MSME పార్కుల్లో వీరికి ప్రాధాన్యత ఇచ్చే అంశంపై CMతో చర్చిస్తామని శాస్త్ర, సాంకేతిక శాఖ సమీక్షలో తెలిపారు. ‘అవసరాలకు తగినట్లు మనమే వస్తువులు తయారు చేసుకోవాలి. మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా లక్ష్యం అదే. దిగుమతుల మీద ఆధారపడడం తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది’ అని చెప్పారు.


