News March 29, 2025
కలిసిమెలిసి పండుగలు జరుపుకుందాం: మహబూబ్నగర్ MLA

హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తదితర అన్ని మతాల వారు కలిసిమెలిసి పండుగలు జరుపుకుందామని, కులమతాలకు అతీతంగా వేడుకలు నిర్వహిద్దామని కాంగ్రెస్ నేత, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకుని మహబూబ్నగర్ పట్టణంలోని షాషబ్గుట్ట, సద్దలగుండు మసీదుల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మతసామరస్యం చాటుదామన్నారు.
Similar News
News September 18, 2025
VJA: దుర్గా మల్లేశ్వరస్వామి హుండీ ఆదాయ వివరాలు

ఇంద్రకీలాద్రిపై గత 14 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.2,17,98,528 నగదు, 235 గ్రా. బంగారం, 1.39 కి.గ్రా. వెండి హుండీ కానుకలుగా వచ్చాయని EO శీనా నాయక్ తెలిపారు. 321 US డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 25 UAE దిర్హమ్స్, 25 సౌదీ రియల్స్, 200 ఒమన్ బైసా కరెన్సీతో పాటు 7 ఇతర దేశాల విదేశీ కరెన్సీ ఇంద్రకీలాద్రిపై ఉన్న 48 హుండీలలో కానుకలుగా వచ్చాయన్నారు.
News September 18, 2025
చంద్రబాబూ.. అధికారంలోకి వచ్చింది ఇందుకేనా: జగన్

AP: ‘పేదలకు ఇళ్ల’ విషయంలో కూటమి ప్రభుత్వ పనితీరు సున్నా అని మాజీ సీఎం, YCP అధినేత జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు గారూ మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? ఇప్పటివరకూ ఏ ఒక్కరికీ పట్టాలివ్వలేదు. మా హయాంలో ఇచ్చిన వాటిని లాక్కుంటున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. నిరసనలు, ఆందోళనలకు సిద్ధం కావాలని పార్టీ కేడర్కు పిలుపునిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
News September 18, 2025
వరంగల్: వామ్మో.. ఇంతమంది ఉన్నా..?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో ఇద్దరు IASలు, ముగ్గురు IPSలతో జిల్లా మొత్తం నడిచేది. చిన్న జిల్లాలు అయ్యాక ఏకంగా ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలకు ఆరుగురు కలెక్టర్లతో పాటుగా మరో ముగ్గురు IASలు ఉండగా, 10 మంది IPSలు పని చేస్తున్నారు. పెద్ద జిల్లాగా ఉన్న సమయంలో ఒక కలెక్టర్, ఒక ఐపీఎస్ అధికారి మొత్తం జిల్లాను పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఇంతమంది సివిల్ సర్వెంట్లున్నా చెప్పుకోదగ్గ పనులేవి లేవని ప్రజలు అంటున్నారు.