News July 23, 2024
కలెక్టరేట్లో ‘అనంత మమతా నిలయం’ ప్రారంభం
అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వినూత్నంగా ఆలోచించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే పాలిచ్చే తల్లులకు, మహిళలకు, కలెక్టరేట్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఉపయోగపడేలా అనంతపురం కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశారు. ఆ గదికి ‘అనంత మమతా నిలయం’ అనే పేరు పెట్టారు. చిన్నారులు ఆడుకునేలా బొమ్మలు, గోడలపై అందమైన చిత్రాలను చిత్రీకరించారు.
Similar News
News October 1, 2024
రూ.3 కోసం హోటల్పై దాడి.. అనంతపురం జిల్లాలో ఘటన
రూ.3 కోసం హోటల్పై దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. పెద్దపప్పూరు మం. పరిధిలోని చీమలవాగుపల్లి సమీపంలో నారాయణస్వామి అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నారు. కొంత మంది వ్యక్తులు ఓ వస్తువు కొనుగోలు చేయగా హోటల్ యజమాని రూ.3 తిరిగివ్వాల్సి ఉంది. తర్వాత ఇస్తానని చెప్పగా మాటామాటా పెరిగి హోటల్పై దాడికి పాల్పడ్డారు. ఈఘటనపై కేసు నమోదు చేసినట్లు పెద్దపప్పురు SI గౌస్ బాషా తెలిపారు.
News October 1, 2024
అనంతపురంలో టన్ను చీనీ రూ.18 వేలు
అనంతపురం వ్యవసాయ మార్కెట్లో చీనీ కాయల ధరలు ముందుకు సాగడం లేదు. సోమవారం మార్కెట్కు 10టన్నుల చీనీ కాయలు దిగుమతి అయినట్లు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గోవిందు ఓ ప్రకటనలో తెలిపారు. అందులో గరిష్ఠంగా టన్ను రూ.18 వేలు, సరాసరి రూ.15 వేలు, కనిష్ఠంగా రూ.10 వేల ధర పలికినట్లు వెల్లడించారు. మార్కెట్లో ధరలు పెరగకపోవడంతో దిగుమతి తగ్గినట్లు తెలిపారు. మరోవైపు జిల్లాలో కిలో టమాటా గరిష్ఠంగా రూ.48 పలుకుతోంది.
News October 1, 2024
చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సవిత
చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పెనుకొండలోని క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. యువతీ, యువకుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లు రూపకల్పన చేస్తున్నామని, ఆ డిజైన్లపై చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణతో సరిపెట్టకుండా చేనేత వస్త్రాలకు మార్కెట్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు.