News April 15, 2025
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్

HYDలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ హోదాలో కలెక్టర్ డా. పి.శ్రీజ పాల్గొన్నారు. భూ భారతి పోర్టల్, ఇందిరమ్మ ఇండ్లు, వేసవిలో తాగు నీటి ప్రణాళికలపై సీఎం చర్చించినట్లు ఇన్చార్జ్ కలెక్టర్ తెలిపారు. భూ భారతి పైలెట్ ప్రాజెక్టు సదస్సులను ఆయా మండలాల్లో ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో సదస్సులు నిర్వహించాలని సీఎం చెప్పారన్నారు.
Similar News
News April 19, 2025
ఖమ్మం: ఈనెల 20న నెల నెలా వెన్నెల కార్యక్రమం

ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఈ నెల 20న సాయంత్రం 6 గంటలకు నెల నెలా వెన్నెల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మోటమర్రి జగన్మోహన్ రావు, అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్, కె.దేవేంద్ర, నాగబత్తిని రవి, వేల్పుల విజేత, లక్ష్మీనారాయణ, వేముల సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన సిరిమువ్వ కల్చరల్స్ కళాబృందం ‘హక్కు’ నాటిక ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
News April 18, 2025
ఖమ్మం: ఫైనాన్స్ వేధింపులు.. యువకుడి SUICIDE

ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) బోనకల్(M) గోవిందపురం(ఎల్)లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇసంపల్లి సైదా గత కొద్ది రోజుల క్రితం ఓ కంపెనీలో ఫైనాన్స్ తీసుకోగా ఈఎంఐ చెల్లించకపోవడంతో ఫైనాన్సర్ వేధింపులు ఎక్కువయ్యాయి.. దీంతో మనస్తాపం చెంది, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని గ్రామస్థులు తెలిపారు. మృతుడి భార్య ఠాణాలో ఫిర్యాదు చేశారు.
News April 18, 2025
ఖమ్మం: CMRF గందరగోళం.. ఆసుపత్రులకు నోటీసులు

పేదలకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి బిల్లులను ఖమ్మంలోని పలు ఆసుపత్రులు నకిలీ బిల్లులు సృష్టించి రూ.లక్షల విలువ గల CMRF చెక్కులను కాజేశాయి. ఈ అంశంపై కొద్దినెలల క్రితం సీఎంఓకు అందిన ఫిర్యాదుతో పలు ఆసుపత్రులపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. నేడు తాజాగా ఆ ఆసుపత్రులకు నోటీసులు పంపి, రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని ఆదేశించారు. పేదలకు అందాల్సిన పథకం నిర్వీర్యం అవుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు.