News April 10, 2025

కలెక్టర్ అన్సారీయాకు ఆహ్వానం

image

కనిగిరిలోని ఎంవీఆర్ కళ్యాణ మండపంలో ఈ నెల 16న జరిగే అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలకు రావాలని కలెక్టర్ తమీమ్ అన్సారియాను గురువారం రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేశ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు కలిసి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అన్సారియా జయంతి ఉత్సవాల్లో తప్పక పాల్గొంటామని హామీ ఇచ్చినట్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలిపారు.

Similar News

News October 14, 2025

SNపాడులో 17న జాబ్ మేళా..!

image

SNపాడులోని DMSVK మహిళా కళాశాలలో ఈనెల 17వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజలు తెలిపారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం కలెక్టర్ రాజాబాబు ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. 18 నుంచి 35ఏళ్ల వయసు గల నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నట్లు తెలిపారు.

News October 14, 2025

గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

ఒంగోలు పాత ZPHS సమావేశ మందిరంలో ఒంగోలు డివిజన్ పంచాయతీ కార్యదర్శులతో భౌతిక సమీక్షా సమావేశాన్ని డీపీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజబాబు, హాజరై పంచాయతీ కార్యదర్శులకు పారిశుద్ధ్య చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, పారిశుద్ధ్యంలో ప్రకాశం జిల్లాను ముందంజలో ఉంచాలన్నారు.

News October 14, 2025

ప్రకాశంలో ఒక్కరోజే ఐదుగురి మృతి

image

ప్రకాశంలో నిన్న విషాద ఘటనలు జరిగాయి. ఒంగోలు సమీపంలో తెల్లవారుజామున బస్సు బోల్తా పడి ఒకరు చనిపోగా, 13మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా రిమ్స్ నుంచి మరో వైద్యశాలకు తరలించారు. <<17997659>>CSపురం<<>>, <<17998375>>కొనకనమిట్ల <<>>వద్ద రాత్రి గంటల వ్యవధిలో రెండు ప్రమాదంలో జరిగాయి. ఆ రెండు ఏరియాల్లో ఇద్దరేసి చొప్పున నలుగురు ప్రాణాలు వదిలారు.