News January 26, 2025

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

image

పల్నాడు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబు ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రిపబ్లిక్ డే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని రంగాలలోనూ జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు ఇవ్వటం ద్వారా ప్రజలకు సంక్షేమం అందిస్తామన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News December 7, 2025

కొత్తగూడెం: వామ్మో.. రూ.12.35 లక్షల కరెంటు బిల్లు హా

image

ప్రతినెల వేలల్లో వచ్చే కరెంటు బిల్లు ఒక్కసారిగా రూ.12,35,191 రావడంతో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్‌కు చెందిన షాపు నిర్వాహకుడు అశోక్‌ ఆందోళనకు గురయ్యారు. గత నెలలో రూ.40,063 ఉన్న బిల్లు ఈ నెలలో లక్షల్లో చేరడాన్ని చూసి అవాక్కయ్యారు. అధికారుల తప్పిదం వల్లే ఇలా జరిగిందని, సరిచేయాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 7, 2025

శ్రీసత్యసాయి: తల్లిదండ్రుల మృతి.. అనాథలైన ఇద్దరమ్మాయిలు

image

పరిగిలో అమ్మానాన్నలు మృతి చెందడంతో వారి ఇద్దరి అమ్మాయిలు అనాథలయ్యారు. ఎనిమిదేళ్ల క్రితం తల్లి మరణించగా.. శనివారం తెల్లవారుజామున తండ్రి భజంత్రీ గోపాల్ గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో వారి కుమార్తెలు ఇద్దరూ అనాథలయ్యారు. మండల పాత్రికేయులు తమ వంతుగా ఆ బాలికలకు ఆర్థిక సాయం అందజేసి, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తోడుంటామని భరోసా కల్పించారు.

News December 7, 2025

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్‌తో మహిళ మృతి.. కానీ!

image

ప్రకాశం జిల్లాలో ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధి పాజిటివ్ వచ్చిన మహిళ మృతి చెందినట్లు ప్రకాశం DMHO వెంకటేశ్వర్లు తెలిపారు. యర్రగొండపాలెం మండలానికి చెందిన వృద్ధురాలు గతనెల 11న అనారోగ్యానికి గురైంది. అయితే మెరుగైన చికిత్స కోసం గుంటూరు GGHకు తరలించారు. 29న అక్కడ నిర్వహించిన <<18481778>>టెస్టుల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్<<>> వచ్చిందన్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా మృతికి కారణంగా డీఎంహెచ్వో తెలిపారు.