News May 20, 2024
కలెక్టర్ ప్రెస్ మీట్ పై.. పల్నాడు ప్రజల్లో ఉత్కంఠ

పల్నాడు జిల్లా కలెక్టర్గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం 10:30 గంటలకు నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని SR శంకరం వీడియో కాన్ఫరెన్స్ హాలులో పాత్రికేయులతో కలెక్టర్ సమావేశం కానున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే జరిగిన ఘటనలతో ఎస్పీ సస్పెండ్ కాగా, కలెక్టర్ బదిలీ అయ్యారు. దీంతో ఆయన ఏం మాట్లాడతారనే దానిపై పల్నాడు వాసులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Similar News
News April 23, 2025
పదో తరగతి పరీక్షల్లో ఆటో డ్రైవర్ కుమార్తె టాపర్

తెనాలి(M) సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన మద్దినేని మనోజ్ఞ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో చదువుతున్న మనోజ్ఞ 591 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచారు. సర్కార్ బడిలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన మనోజ్ఞను పలువురు అభినందించారు. మనోజ్ఞ తండ్రి మధుబాబు ఆటో డ్రైవర్ వృత్తిలో ఉన్నారు. ఐఐటీలో చదవాలన్నది తన లక్ష్యమని మనోజ్ఞ తెలిపారు.
News April 23, 2025
టెన్త్ ఫలితాల్లో అద్భుతంగా రాణించిన గుంటూరు

గుంటూరు జిల్లా పదో తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించింది. రెగ్యులర్ విద్యార్థులలో 27,255 మంది పరీక్ష రాయగా, 24,169 మంది ఉత్తీర్ణత సాధించి 88.53 శాతంతో రాష్ట్రంలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది ఉత్తీర్ణత 86.69శాతంతో 16వ స్థానంలో నిలిచింది. ఈసారి ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 4వ స్థానంలో నిలవడం విశేషం.
News April 23, 2025
10th RESULTS: 4వ స్థానంలో గుంటూరు జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 27,255 మంది పరీక్ష రాయగా 24,129 మంది పాసయ్యారు. 14444 మంది బాలురులో 12567 మంది, 12811 మంది బాలికలు పరీక్ష రాయగా 11562 మంది పాసయ్యారు. 88.53 పాస్ పర్సంటైల్తో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.