News September 23, 2024

కల్తీ నెయ్యితో లడ్డూ చేయలేదు: ధర్మాన

image

కల్తీ జరిగిందని గుర్తించిన TTD.. ఆ నెయ్యితో లడ్డూలే తయారు చేయలేదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ‘వాడని నెయ్యి, తయారు కాని లడ్డూలు పట్టుకుని సీఎం చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. లడ్డూ తయారీలో కొవ్వు కలిసిందని దుష్ర్పచారం చేస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. శ్రీవారితో రాజకీయాలు బాబుకే చెల్లింది. దేవుడితో రాజకీయాలు తగవు’ అని ఓ ప్రకటనలో ధర్మాన పేర్కొన్నారు.

Similar News

News December 1, 2025

శ్రీకాకుళం జిల్లా SP గ్రీవెన్స్‌కు 61 అర్జీలు.!

image

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను SP ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు విన్నారు. కాగా నేడు మొత్తం 61 అర్జీలు స్వీకరించామన్నారు.

News December 1, 2025

శ్రీకాకుళం జిల్లా SP గ్రీవెన్స్‌కు 61 అర్జీలు.!

image

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను SP ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా SP కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు విన్నారు. కాగా నేడు మొత్తం 61 అర్జీలు స్వీకరించామన్నారు.

News December 1, 2025

ధాన్యం రవాణాకు GPS వాహనం తప్పనిసరి: కలెక్టర్

image

ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్‌ఎస్‌కే) ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించి, ప్రభుత్వం ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.