News September 23, 2024

కల్తీ నెయ్యితో లడ్డూ చేయలేదు: ధర్మాన

image

కల్తీ జరిగిందని గుర్తించిన TTD.. ఆ నెయ్యితో లడ్డూలే తయారు చేయలేదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ‘వాడని నెయ్యి, తయారు కాని లడ్డూలు పట్టుకుని సీఎం చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. లడ్డూ తయారీలో కొవ్వు కలిసిందని దుష్ర్పచారం చేస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. శ్రీవారితో రాజకీయాలు బాబుకే చెల్లింది. దేవుడితో రాజకీయాలు తగవు’ అని ఓ ప్రకటనలో ధర్మాన పేర్కొన్నారు.

Similar News

News October 16, 2024

25న శ్రీకాకుళంలో జాబ్ మేళా

image

శ్రీకాకుళంలోని గవర్నమెంట్ DLTC కాలేజీలో ఈనెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ హబ్ కోఆర్డినేటర్ N.శేషగిరి తెలిపారు. పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI, పూర్తి చేసి 18-24 ఏళ్లు కలిగిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News October 16, 2024

LLB పరీక్ష టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB 3 సంవత్సరానికి సంబంధించి 2, 4 సెమిస్టర్ల పరీక్ష టైం టేబుల్ విడుదలైంది. వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.. 2వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయన్నారు.

News October 16, 2024

సంతబొమ్మాళి ఘటనలో తల్లి మృతి

image

సంతబొమ్మాలి మండలం కుమందానివానిపేట గ్రామంలో ఇద్దరు చిన్నారులకు తల్లి విషమిచ్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తల్లి దుర్గ సైతం చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున 3 గంటలకు మృతిచెందినట్లు టెక్కలి జిల్లా ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. చిన్నారుల మృతి అనంతరం ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్చగా చనిపోయింది.