News March 23, 2025
కల్వకుర్తి: అనారోగ్యంతో ఖానాపూర్ మాజీ ఎంపీటీసీ మృతి

కల్వకుర్తి నియోజకవర్గం లోని ఎమ్మెల్యే సొంత గ్రామం ఖానాపూర్కు చెందిన మాజీ ఎంపీటీసీ గార్లపాటి సరిత (46) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఆమె ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఎంపీటీసీగా ఆమె గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గ్రామస్థులు తెలిపారు. ఆమె మరణం ఈ ప్రాంతానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News October 19, 2025
దీపావళి శాంతియుతంగా జరుపుకోండి: ADB కలెక్టర్

దీపావళి వెలుగుల పండుగగా ప్రతి ఇంటిలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నిండాలని ఆకాంక్షించారు. గిరిజనుల సాంప్రదాయ పండుగ దండారి గుస్సాడి సందర్భంగా గిరిజన సోదరులు, కళాకారులకు కలెక్టర్ రాజర్షి షా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ పండుగలను శాంతి, ఐకమత్యం, సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
News October 19, 2025
రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలి: సీఎం చంద్రబాబు

AP: చీకట్లను పారద్రోలి వెలుగుల్ని తీసుకువచ్చే పండుగ దీపావళి అని CM CBN అన్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘లోకాన్ని పీడిస్తున్న నరకాసురుడిని శ్రీ కృష్ణ, సత్యభామ కలిసి వధించిన రోజు ఇది. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలి. రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలి’ అని ట్వీట్ చేశారు. అటు దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని YS జగన్ ఆకాంక్షించారు.
News October 19, 2025
లేగదూడను చూసి CM మురిసే!

యాదవుల సదర్ అంటే CM రేవంత్ రెడ్డికి మక్కువ అని చెప్పడానికి ఈ ఫొటో చక్కటి ఉదాహరణ. NTR స్టేడియం వద్ద నిర్వహించిన సదర్లో రేవంత్ ఏ ఒక్కరినీ నిరాశ పర్చలేదు. కళాకారుల నుంచి యువత వరకు అందరినీ పలకరించారు. యాదవ సోదరులతో ఫొటోలు దిగి సంభాషించారు. వేదిక ఎక్కిన తర్వాత అందంగా అలంకరించిన ఓ లేగదూడను చూసి ఆయన ముగ్ధుడయ్యారు. ఆ దూడెను తన దగ్గరకు తీసుకోవడం సదర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.