News March 23, 2025
కల్వకుర్తి: అనారోగ్యంతో ఖానాపూర్ మాజీ ఎంపీటీసీ మృతి

కల్వకుర్తి నియోజకవర్గం లోని ఎమ్మెల్యే సొంత గ్రామం ఖానాపూర్కు చెందిన మాజీ ఎంపీటీసీ గార్లపాటి సరిత (46) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆస్పత్రిలో చేరిన ఆమె ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఎంపీటీసీగా ఆమె గ్రామ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గ్రామస్థులు తెలిపారు. ఆమె మరణం ఈ ప్రాంతానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News February 23, 2026
సైన్స్ సమగ్ర మహోత్సవం.. ప్రాజెక్టుల అప్లోడ్కు DEO పిలుపు

నేషనల్ సైన్స్ డే పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సైన్స్ సమగ్ర మహోత్సవం’ కోసం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని DEO పి.నాగేశ్వరరావు సూచించారు. ప్రదర్శనలకు సంబంధించిన ఫోటోలు, 3నిమిషాల నిడివి గల వీడియోలను sciencesamagra.in పోర్టల్లో సమర్పించాలని కోరారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన ప్రాజెక్టులను ఎంపిక చేసి విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.
News February 23, 2026
కామారెడ్డి జిల్లాలో వాతావరణ వివరాలు..

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో విభిన్న వాతావరణం నెలకొంది. మధ్యాహ్న సమయంలో ప్రజలు ఉక్కపోతకు గురవ్వగా, రాత్రి అక్కడక్కడ వర్షపాతం నమోదయింది. అధికారుల వివరాల ప్రకారం జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత బీబీపేట 24.4°C , అత్యల్ప ఉష్ణోగ్రత సర్వాపూర్ 20.6°C లుగా నమోదయ్యాయి. కాగా పిట్లం లో 16మి.మీ, జుక్కల్ 7.8, సోమూర్ 4.8, సర్వాపూర్ 4.5, బిచ్కుంద 3.3, మక్దూంపూర్ 2.8, మేనూరు 2.5మి.మీ వర్షపాతం నమోదయింది.
News February 23, 2026
నాగర్కర్నూల్ ఘటన.. NHRCకి ఫిర్యాదు

నాగర్కర్నూల్ కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా 2నెలల పసికందు మృతిచెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు అందింది. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం కమ్మగూడెంకు చెందిన న్యాయవాది వినోద్ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. కులవివక్ష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.


