News April 11, 2025
కల్వకుర్తి: కలెక్టర్ను కలిసిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు

కల్వకుర్తి తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్ను సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడు బాలకృష్ణ జిల్లా కలెక్టర్కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జూలూరి రమేష్ బాబు, రామస్వామి తదితరులు ఉన్నారు.
Similar News
News February 25, 2026
గుంతకల్లు డివిజన్లో ఖాళీల భర్తీకి కసరత్తు

సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్లు డివిజన్లో పాయింట్స్ మెన్ ఖాళీల భర్తీ కోసం 16 మంది మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రూ.18,000 వేతనం, ఇతర భత్యాలు చెల్లించనున్నారు. మాజీ సైనికులు మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులను గుంతకల్లు డివిజన్ కార్యాలయానికి సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కోసం 08554 241146 సంప్రదించవచ్చన్నారు.
News February 25, 2026
5 OTTలను బ్యాన్ చేసిన కేంద్రం

అశ్లీల కంటెంట్ను ప్రసారం చేస్తున్న 5 OTT యాప్స్పై కేంద్రం వేటు వేసింది. MoodXVIP, Koyal Playpro, Digi Movieplex, Feel, Jugnu అనే ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది. అసభ్యకరమైన వీడియోలతో యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయనే ఫిర్యాదులతో IT రూల్స్ 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ఇకపై ఇవి ఇండియాలో పనిచేయవు.
News February 25, 2026
విజయానికి నాలుగు సూత్రాలు

కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకః|
మౌనేన కలహో నాస్తి నాస్తి జాగరతో భయః|
మనది వ్యవసాయాధారిత దేశం కాబట్టి సాగును నమ్ముకుంటే ఆకలి చావులు ఉండవని ఈ శ్లోకం చెబుతోంది. శ్లోకార్థం: కృషి ఉంటే కరవు ఉండదు. జపం చేస్తే పాపాలు నశిస్తాయి. మౌనం వహిస్తే కలహాలు రావు. అప్రమత్తంగా ఉంటే భయం ఉండదు.


