News April 11, 2025
కల్వకుర్తి: కలెక్టర్ను కలిసిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు

కల్వకుర్తి తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్ను సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తాలూకా అధ్యక్షుడు బాలకృష్ణ జిల్లా కలెక్టర్కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు జూలూరి రమేష్ బాబు, రామస్వామి తదితరులు ఉన్నారు.
Similar News
News July 11, 2025
ములుగు జిల్లా జనసాంద్రత 71

ములుగు జిల్లా మొత్తం 3881 చ.కి.మి విస్తీర్ణం కలిగి ఉండగా 2,94,671 జనాభా ఉంది. వీరిలో పురుషులు 1,46,205, మహిళలు 1,48,466 ఉండగా జిల్లాలో జనసాంద్రత 71గా ఉంది. అయితే ఉమ్మడి కుటుంబంతోనే సంతోషంగా ఉండొచ్చని పలువురు అంటున్నారు. మారుతున్న కాలనీకి అనుగుణంగా పేరెంట్స్ ప్రస్తుతం ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. జనాభా పెరుగుదలతో అనేక సమస్యలు వస్తాయంటున్నారు. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.
News July 11, 2025
కరీంనగర్: ‘రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి’

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జులై 12, 13 తేదీల్లో జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్ మాట్లాడుతూ.. తరగతుల్లో విద్యార్థి సమస్యలు, జాతీయవాదం, దేశభక్తి తదితర అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రారంభ ఉపన్యాసాన్ని గుమ్మడి నరసయ్య ఇవ్వనున్నారు.
News July 11, 2025
రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదు: ఎంపీ

సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే స్థాయి కేటీఆర్కు లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ సెంటిమెంట్ను తెరమీదకు తెస్తున్నారని పేర్కొన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణకు మాత్రమే లాభం జరిగిందని, దక్షిణ తెలంగాణను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ‘కేటీఆర్కు నిజంగా దమ్ముంటే.. కేసీఆర్ దగ్గర నుంచి ప్రతిపక్ష హోదాను తెచ్చుకోవాలి’ అంటూ సవాలు విసిరారు.