News April 11, 2025
కల్వకుర్తి: ‘కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రయత్నాలు..?’

కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పార్టీలో కీలక పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 5, 2025
చిగ్గర్ మైట్ పురుగుతో స్క్రబ్ టైపస్ వ్యాధి: బాపట్ల DMHO

స్క్రబ్ టైపస్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల DMHO విజయమ్మ చెప్పారు. శుక్రవారం జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. స్క్రబ్ టైపస్ కొత్త రకం కాదన్నారు. జ్వరం, తలనొప్పిని ఈ వ్యాధి లక్షణాలుగా గుర్తించాలన్నారు. చిగ్గర్ మైట్ అనే చిన్న పురుగు వలన వ్యాధి వ్యాపిస్తుందన్నారు. పురుగు కుట్టినచోట నల్లగా మచ్చలు ఏర్పడతాయన్నారు. వ్యాధిని తొలి దశలోనే గుర్తించి చికిత్స పొందాలన్నారు.
News December 5, 2025
14,967 ప్రభుత్వ ఉద్యోగాలు.. BIG UPDATE

జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో 14,967 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం నిన్నటితో గడువు ముగియగా అభ్యర్థుల వినతితో ఈ నెల 11 వరకు అవకాశం కల్పించారు. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, ఇంటర్, డిప్లొమా పాసైనవారు అర్హులు. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: <
News December 5, 2025
Ashes Day-2: స్వల్ప ఆధిక్యంలో ఆసీస్

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ రెండో టెస్టు రసవత్తరంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ 334 రన్స్కు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు 44 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. వెదరాల్డ్ 72, లబుషేన్ 65, స్మిత్ 61, గ్రీన్ 45, కేరీ 46* పరుగులు చేశారు.


