News April 11, 2025

కల్వకుర్తి: ‘కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రయత్నాలు..?’

image

కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పార్టీలో కీలక పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

Similar News

News November 4, 2025

కాజీపేట: ఏటీఎం కార్డు మార్చి.. నగదు కాజేసిన దుండగుడు..!

image

కాజీపేటలో ఏటీఎం మోసం ఘటన కలకలం రేపింది. రైల్వే ఉద్యోగి దావ కల్పన యూనియన్ బ్యాంకు ఏటీఎంలో రూ.46 వేల డిపాజిట్ చేస్తుండగా ఓ దుండగుడు సాయం చేస్తున్నట్లు నటించి ఆమె కార్డును మార్చి వేరే కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. ఇంటికి చేరిన కొద్దిసేపట్లోనే రూ.45 వేలు డ్రా అయినట్లు మెసేజీలు రావడంతో ఆమె షాక్‌కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

News November 4, 2025

చిత్తూరు విద్యార్థులకు అరుదైన అవకాశం

image

చిత్తూరులోని ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు N.లాస్య, M.రమాకాంత్‌కు అరుదైన అవకాశం దక్కింది. వీరిద్దరూ సైన్స్‌లో ప్రతిభ చూపడంతో “సైన్స్ ఎక్స్‌పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్”‌కు సెలెక్ట్ చేశారు. ఇందులో భాగంగా నవంబర్ 6 నుంచి ఢిల్లీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి వివిధ కార్యాలయాలను చూపిస్తారు. పరిశోధనాసక్తి, దేశభక్తి పెంపొందించేలా టూర్ ఉంటుందని డీఈవో వరలక్ష్మి తెలిపారు.

News November 4, 2025

విజయవాడ: పలగాని నాగవైష్ణవి హత్య కేసు ఏమిటంటే?

image

విజయవాడకు చెందిన పలగాని ప్రభాకర్.. తొలుత మేనకోడల్ని పెళ్లి చేసుకోగా పిల్లలు పుట్టకపోవడంతో మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు వైష్ణవితో పాటు మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రభాకర్ మొదటి భార్య తమ్ముడైన కృష్ణ.. ఆస్తి 2వ భార్యకు దక్కుతుందని భావించి <<18192610>>వైష్ణవిని.. శ్రీనివాస్, జగదీశ్‌ సాయంతో చంపారనేది అభియోగం.<<>> కాగా కుమార్తె మృతితో ప్రభాకర్ హఠాన్మరణం చెందగా కొన్నాళ్లకు తల్లి కూడా మరణించింది.