News February 3, 2025

కల్వకుర్తి: కీలక కమిటీలో వంశీచంద్ రెడ్డికి చోటు

image

కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది బృంద సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.

Similar News

News November 18, 2025

రోడ్డుపై అడ్డంగా క్యూలైన్‌.. రాజన్న భక్తుల పాట్లు

image

వేములవాడ రాజన్న దర్శనాలను భీమేశ్వరాలయంలోకి మార్చినప్పటి నుంచి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భీమన్న ఆలయంలోకి వెళ్లడానికి పార్వతిపురం వెనుక నుంచి కొత్త క్యూలైన్ నిర్మించారు. నటరాజ్ విగ్రహం ముందు ఈ క్యూలైన్‌ను రోడ్డుపై అడ్డంగా నిర్మించడంతో ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటే మార్గం లేకపోవడంతో కొంతమంది మహిళా భక్తులు సోమవారం రాత్రి క్యూలైన్లపైకి ఎక్కి మరీ దాటడాన్ని పై ఫొటోలో చూడొచ్చు.

News November 18, 2025

రోడ్డుపై అడ్డంగా క్యూలైన్‌.. రాజన్న భక్తుల పాట్లు

image

వేములవాడ రాజన్న దర్శనాలను భీమేశ్వరాలయంలోకి మార్చినప్పటి నుంచి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భీమన్న ఆలయంలోకి వెళ్లడానికి పార్వతిపురం వెనుక నుంచి కొత్త క్యూలైన్ నిర్మించారు. నటరాజ్ విగ్రహం ముందు ఈ క్యూలైన్‌ను రోడ్డుపై అడ్డంగా నిర్మించడంతో ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటే మార్గం లేకపోవడంతో కొంతమంది మహిళా భక్తులు సోమవారం రాత్రి క్యూలైన్లపైకి ఎక్కి మరీ దాటడాన్ని పై ఫొటోలో చూడొచ్చు.

News November 18, 2025

టెక్నాలజీతో ఉత్తమ ఫలితాలు.. జర్మనీ సదస్సులో జిల్లా రైతులు

image

టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయంలో ఉత్తమమైన ఫలితాలు సాధించవచ్చు అని మామిడిపెల్లికి చెందిన రైతులు నోముల వేణుగోపాల్ రెడ్డి, మోకిడె శ్రీనివాస్, నాగారానికి చెందిన దుంపేట నాగరాజు తమ అనుభవాలను వివరించారు. ACRAT ప్రాజెక్టులో భాగంగా జర్మనీలో ఐదు రోజుల వ్యవసాయ సదస్సులో రాష్ట్రానికి చెందిన 12 మంది సభ్యుల బృందంతో కలిసి పాల్గొన్న వీరు తమ క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకున్నారు.