News February 3, 2025

కల్వకుర్తి: కీలక కమిటీలో వంశీచంద్ రెడ్డికి చోటు

image

కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది బృంద సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.

Similar News

News February 16, 2025

నంద్యాల జిల్లాలో నవజాత శిశువు లభ్యం

image

సిరివెళ్ల మండలం జునెపల్లె ఎస్సీ కాలనీలో నవజాత శిశువు లభ్యం అయ్యింది. ఆదివారం తెల్లవారుజామున గ్రామంలోని ఓ వ్యక్తి కూలీలను పనికి పిలుస్తుండగా ఖాళీ స్థలం నుంచి శిశువు ఏడుపును గమనించాడు. అక్కడికి వెళ్లి చూడగా ఆడ శిశువుగా గుర్తించాడు. 108 వాహనానికి ఫోన్ చేయగా వారు వైద్యం నిమిత్తం శిశువును తీసుకెళ్లారు. అధికారులు విచారణ చేపట్టారు.

News February 16, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

బర్డ్ ఫ్లూతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నా ధరల్లో పెద్దగా మార్పు లేదు. గత వారం కేజీ చికెన్ రూ.220-240 ఉండగా, ఇప్పుడు రూ.200-220 పలుకుతోంది. HYD, విశాఖలో స్కిన్ లెస్ కేజీ రూ.200, విజయవాడలో రూ.220, చిత్తూరులో రూ.160 ఉంది. వైరస్ సోకిన కోళ్లను తినొద్దని, సోకని కోడి మాంసాన్ని 70-100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మీరు చికెన్ తింటున్నారా? ధర ఎంత? కామెంట్ చేయండి.

News February 16, 2025

కరీంనగర్: ఈ నెల 18 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం

image

బీసీ స్టడీ సర్కిల్ లో RRB, SSC, BANKING ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతాయని KNR బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్థుల కోరిక మేరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి 18న ఉదయం 10 గంటలకు క్లాసులకు హాజరు కావాలని కోరారు.

error: Content is protected !!