News March 23, 2025
కల్వకుర్తి: నీటి సంపులో పడి మహిళ మృతి

కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ నిర్మల విద్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న బాలకృష్ణమ్మ (49) నీటి సంపులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి ఆవరణలోని సంపులో శనివారం ప్రమాదవశాత్తు జారి పడినట్లు చెప్పారు. స్థానికులు గమనించి ఆమెను బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త 15 నెలల క్రితం చనిపోయినట్లు తెలుస్తోంది.
Similar News
News November 19, 2025
బిహార్ సీఎంగా మరోసారి నితీశ్ కుమార్

బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్డీఏ సభాపక్ష నేతగా నితీశ్ పేరును BJP ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రేపు ఉ.11.30 గంటలకు పట్నాలోని గాంధీ మైదానంలో 10వ సారి సీఎంగా ప్రమాణం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు మరో 19మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 202 సీట్లు సాధించింది.
News November 19, 2025
ర్యాలీని ప్రారంభించిన మేయర్, కమిషనర్

వరల్డ్ టాయిలెట్ డేను పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు, పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులతో మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ సమావేశం నిర్వహించారు. అనంతరం సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు వాహనాలతో ఏర్పాటు చేసిన ర్యాలీని వారు ప్రారంభించారు. ఉత్తమ సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లు, పబ్లిక్ టాయిలెట్ నిర్వాహకులను మేయర్, కమిషనర్ సత్కరించారు.
News November 19, 2025
ఎర్రకోట నుంచి కశ్మీర్ వరకు దాడులు చేయగలం: పాక్ నేత

ఇండియానే లక్ష్యంగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని మరోసారి రుజువైంది. ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు టెర్రర్ గ్రూపులతో దాడులు చేస్తామని పాక్ నేత చౌదరి అన్వరుల్ హక్ హెచ్చరించారు. ఇప్పటికే తాము ఈ పని చేశామని, వారు బాడీలను లెక్కించలేకపోతున్నారంటూ విషం కక్కారు. బలూచిస్థాన్లో జోక్యం చేసుకుంటే ఇలాగే జరుగుతుందన్నారు. ఎర్రకోట ఆత్మాహుతి దాడి, పహల్గామ్ అటాక్లనే అతను పరోక్షంగా ప్రస్తావించారు.


