News March 23, 2025

కల్వకుర్తి: నీటి సంపులో పడి మహిళ మృతి

image

కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ నిర్మల విద్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న బాలకృష్ణమ్మ (49) నీటి సంపులో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి ఆవరణలోని సంపులో శనివారం ప్రమాదవశాత్తు జారి పడినట్లు చెప్పారు. స్థానికులు గమనించి ఆమెను బయటకు తీసేసరికి అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతురాలి భర్త 15 నెలల క్రితం చనిపోయినట్లు తెలుస్తోంది.

Similar News

News March 28, 2025

చాట్ జీపీటీని దాటేసిన గ్రోక్

image

ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బోట్ ‘గ్రోక్’ సంచలనం సృష్టిస్తోంది. అమెరికా గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ టాప్ ఫ్రీ లిస్టులో అగ్రస్థానానికి చేరింది. ఈ క్రమంలో గ్రోక్.. చాట్ జీపీటీ, టిక్‌టాక్‌ను దాటేసినట్లు మస్క్ ట్వీట్ చేశారు. గ్రోక్ ఆండ్రాయిడ్ యాప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అందుబాటులోకి వచ్చింది.

News March 28, 2025

ఏలూరు: ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్

image

సర్వ మానవాళి సుఖ సంతోషాలు రంజాన్ ప్రార్ధనల ముఖ్య ఉద్దేశ్యం అని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. స్థానిక గిరిజన భవన్‌లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ‘ఇఫ్తార్’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్ష ద్వారా మానసిక, శారీరక పవిత్రత చేకూరుతుందన్నారు.

News March 28, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

❤జడ్చర్ల:నీటి సంపులో మహిళ మృతదేహం
❤రేపు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాక
❤కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు
❤ఘనంగా “షబ్‌ -ఏ -ఖదర్‌” వేడుకలు
❤అందరికీ రుణమాఫీ చేయండి:BJP
❤గుడ్ న్యూస్ ఉగాదికి సన్నబియ్యం
❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
❤రంజాన్ వేళ..ఈద్గా వద్ద ఏర్పాట్లు
❤GWL:కాల్వకు నీళ్లు రాకపోతే చావే శరణ్యం
❤అమ్రాబాద్: తండ్రి మృతి పుట్టెడు దు:ఖంలో టెన్త్ ‘పరీక్ష’

error: Content is protected !!