News July 10, 2024

కల్వకుర్తి: పాముకాటుతో రైతు మృతి

image

కల్వకుర్తి పట్టణానికి చెందిన రైతు వసంత యాదయ్య(48) మంగళవారం పాముకాటుతో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన యాదయ్య రోజు మాదిరిగానే ఉదయం తన పొలానికి వెళ్లాడు. పొలం వద్ద బోరు మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పాము కాటేసింది. స్థానికులు గమనించి అతణ్ని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు. యాదయ్యకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.

Similar News

News January 4, 2026

MBNR: ఊళ్లకు వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.!

image

సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డి.జానకి సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని కోరారు. విలువైన నగలు, నగదును బీరువాల్లో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

News January 4, 2026

జడ్చర్ల: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

జడ్చర్ల మండలంలోని ఒక గ్రామంలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థిని ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాలలో చదువుతోంది. వారం క్రితమే అనారోగ్యంతో ఇంటికి వచ్చిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 4, 2026

జడ్చర్ల: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

జడ్చర్ల మండలంలోని ఒక గ్రామంలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థిని ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాలలో చదువుతోంది. వారం క్రితమే అనారోగ్యంతో ఇంటికి వచ్చిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.