News April 2, 2025

కల్వకుర్తి: పిల్లల మృతిపై వీడిన మిస్టరీ.. తల్లే హంతకురాలు!

image

HYD అమీన్‌పూర్‌లో గత నెల 27న కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఆకస్మికంగా మృతిచెందగా తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు నిజం తెలిసింది. కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం మెదక్‌పల్లి వాసి చెన్నయ్య భార్య తన టెన్త్ క్లాస్‌ స్నేహితుడి ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఆమె ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి చంపేసిందని పోలీసుల విచారణలో తేలింది. 

Similar News

News November 21, 2025

భద్రాచలంలో కల్తీ నెయ్యి తయారీ ముఠా అరెస్టు

image

భద్రాచలంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఓ లాడ్జిలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠాను ఎస్ఐ సతీష్ నేతృత్వంలో పోలీసులు అరెస్టు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి తనిఖీ చేయగా, 65 కిలోల కల్తీ నెయ్యి డబ్బాలు లభించాయి. దీని విలువ రూ.52 వేలు ఉంటుందని అంచనా. నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News November 21, 2025

విగ్రహాలను పూజించడం వెనుక సైన్స్

image

హిందూ మతంలో విగ్రహారాధనను ఎక్కువ ప్రోత్సహిస్తాం. అనేక దేవుళ్లు శిలలా మారడంతో విగ్రహాలే దైవాలని మనం వాటికి పూజలు చేస్తుంటాం. దేవుడు అందులో నుంచే మన మొరను వింటాడని అనుకుంటాం. అయితే ఈ విగ్రహారాధన ఆధ్యాత్మికంగా మనకు ఓ స్పెషల్ ఫోకస్‌ను అందిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ప్రార్థన సమయంలో విగ్రహాన్ని చూస్తే.. మన ఆలోచనలు ఆయన రూపంతో అనుసంధానమైన మనల్ని భక్తి పథంలో నడిపిస్తాయని ఓ పరిశోధనలో తేల్చారు.

News November 21, 2025

AIIMS గువాహటిలో 177 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎయిమ్స్ గువాహటి 177 Sr. రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు DEC 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ (MD/MS/DNB), MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, EWSలకు రూ.500. వెబ్‌సైట్: https://aiimsguwahati.ac.in.