News March 28, 2025
కళకళలాడుతోన్న చార్మినార్

అర్ధరాత్రి చార్మినార్ కళకళలాడుతోంది. రంజాన్ మాసంలో నేడు చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల(అల్ విధా జుమ్మా) కోసం ఏర్పాట్లు చేశారు. పండుగకు మరో రెండ్రోజులే సమయం ఉండటంతో జనాలు షాపింగ్ కోసం క్యూకట్టారు. కమాన్ రోడ్, భాగ్యలక్ష్మీ టెంపుల్ రోడ్, లాడ్ బజార్, న్యూ లాడ్ బజార్, రాత్ఖానా గల్లీ, మోతీ గల్లీలు కిక్కిరిసిపోయాయి. వాహనాలు పార్కింగ్కు స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.
Similar News
News November 14, 2025
విశాఖలో మొదలైన సీఐఐ సమ్మిట్

విశాఖలో సీఐఐ సమ్మిట్ మొదలైంది. ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్ సదస్సును ప్రారంభించారు. ఈ సమ్మిట్కు దేశ, విదేశాల నుంచి వ్యపారవేత్తలు హాజరయ్యారు. సదస్సుకు ముందురోజే సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో భారీగా ఎంవోయూలు జరిగాయి. ఈరోజు 25 సెషన్లలో వివిధ అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ సదస్సులో ఏపీ గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
News November 14, 2025
ఆల్పాహార విందులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి

విశాఖపట్నంలో జరుగుతోన్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్.. సీఎం చంద్రబాబు ఇచ్చిన అల్పాహార విందులో పాల్గొన్నారు. వీరితో పాటుగవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఉన్నారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్ రిజల్ట్స్.. నిజామాబాద్ వాసుల ఫోకస్

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని నిజామాబాద్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుస్తుందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రజలలో ఉత్కంఠ రేపుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. గ్రామాల్లో నలుగురు కలిస్తే జూబ్లీ ఫలితంపైనే చర్చిస్తున్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని టాక్.


