News March 28, 2025
కళకళలాడుతోన్న చార్మినార్

అర్ధరాత్రి చార్మినార్ కళకళలాడుతోంది. రంజాన్ మాసంలో నేడు చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల(అల్ విధా జుమ్మా) కోసం ఏర్పాట్లు చేశారు. పండుగకు మరో రెండ్రోజులే సమయం ఉండటంతో జనాలు షాపింగ్ కోసం క్యూకట్టారు. కమాన్ రోడ్, భాగ్యలక్ష్మీ టెంపుల్ రోడ్, లాడ్ బజార్, న్యూ లాడ్ బజార్, రాత్ఖానా గల్లీ, మోతీ గల్లీలు కిక్కిరిసిపోయాయి. వాహనాలు పార్కింగ్కు స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.
Similar News
News November 11, 2025
గోరంట్లలో రామరాయల శాసనం గుర్తింపు

గోరంట్లలోని శ్రీమాధవరాయ స్వామి గుడిలో శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన అరవీటి రామరాయల శాసనాన్ని గుర్తించినట్లు చరిత్రకారుడు మైనాస్వామి చెప్పారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. మాధవ రాయల గుడి ముఖ మండపం దక్షిణ ద్వారం పక్కన 9 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పు గల పెద్ద తెలుగు దానశాసనాన్ని గుర్తించానన్నారు. ఇది 1559 నాటిదని వివరించారు.
News November 11, 2025
కర్నూలు: నాలుగేళ్ల బాలికను ఎత్తుకెళ్లిన వ్యక్తి అరెస్ట్

నాలుగేళ్ల పాపను ఎత్తుకెళ్లిన మధును అరెస్టు చేసినట్లు కర్నూల్ టౌన్-4 సీఐ విక్రమ్ సింహ తెలిపారు. వెల్దుర్తి(M) బుక్కాపురానికి చెందిన మధు(22) సోమవారం పాపతో హైదరాబాద్కు వెళ్తుండగా ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పట్టుకుని చిన్నారిని తల్లికి అప్పగించారు. బాలిక తల్లి సునీత బిక్షాటన చేసుకుంటూ గుడి వద్ద నిద్రించేది. ఈ క్రమంలో మధు పాపను ఎత్తుకెళ్లి అమ్మేందుకు యత్నించాడని సీఐ తెలిపారు.
News November 11, 2025
‘రిచా’ పేరిట స్టేడియం

WWC విన్నర్ రిచా ఘోష్కు అరుదైన గౌరవం దక్కనుంది. స్వరాష్ట్రం వెస్ట్ బెంగాల్లో నిర్మించే స్టేడియానికి ఆమె పేరు పెట్టాలని CM మమతా బెనర్జీ నిర్ణయించారు. అక్కడి సిలిగురిలోని 27 ఎకరాల్లో స్టేడియం నిర్మించాలని స్థానిక మేయర్కు సూచించినట్లు సీఎం తెలిపారు. స్టేడియానికి రిచా పేరు పెడితే భవిష్యత్ తరాలకు ప్రేరణగా ఉంటుందని చెప్పారు. కాగా ఇటీవల రిచాను ప.బెంగాల్ ప్రభుత్వం DSPగా నియమించిన విషయం తెలిసిందే.


