News March 28, 2025
కళకళలాడుతోన్న చార్మినార్

అర్ధరాత్రి చార్మినార్ కళకళలాడుతోంది. రంజాన్ మాసంలో నేడు చివరి శుక్రవారం కావడంతో మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల(అల్ విధా జుమ్మా) కోసం ఏర్పాట్లు చేశారు. పండుగకు మరో రెండ్రోజులే సమయం ఉండటంతో జనాలు షాపింగ్ కోసం క్యూకట్టారు. కమాన్ రోడ్, భాగ్యలక్ష్మీ టెంపుల్ రోడ్, లాడ్ బజార్, న్యూ లాడ్ బజార్, రాత్ఖానా గల్లీ, మోతీ గల్లీలు కిక్కిరిసిపోయాయి. వాహనాలు పార్కింగ్కు స్థలం దొరకని పరిస్థితి నెలకొంది.
Similar News
News October 14, 2025
మల్లోజుల వేణుగోపాల్ నేపథ్యమిదే!

<<18001632>>మల్లోజుల వేణుగోపాల్<<>> అలియాస్ సోనూ దివంగత మావోయిస్టు కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ తమ్ముడు. ఇతని స్వస్థలం TGలోని పెద్దపల్లి. బీకాం చదివిన ఈయన గడ్చిరోలి, ఏపీ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2011 NOVలో బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో కిషన్జీ చనిపోగా, ఆ తర్వాత వేణుగోపాల్ భార్య తార లొంగిపోయారు. 69ఏళ్ల వయసున్న వేణుగోపాల్ మునుపటిలా యాక్టివ్గా లేరని సమాచారం.
News October 14, 2025
కొనుగోళ్లలో పత్తి రైతుకు దక్కని మద్దతు

AP: కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్లో పత్తికి గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి మద్దతు ధర క్వింటాల్కు పొడవు పింజ రూ.8,110, పొట్టి పింజ రూ.7,710గా నిర్ణయించారు. అయితే సోమవారం 16 వేల క్వింటాళ్ల మేర పత్తి అమ్మకానికి రాగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.7,419, కనిష్ఠంగా రూ.3,966కే కొన్నారు. మెజార్టీ పత్తిని క్వింటాకు రూ.5,500-రూ.5000 మధ్యే కొంటున్నారని రైతులు చెబుతున్నారు.
News October 14, 2025
సంగారెడ్డి: సులభమైన పద్ధతిలో బోధన చేయాలి: ఎంఈఓ

సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేటలో డిజిటల్ లెర్నింగ్ విద్యపై నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి విద్యాసాగర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఈఓ మాట్లాడుతూ.. డిజిటల్ పద్ధతిలో విద్యార్థులకు బోధన చేస్తే సులభంగా అర్థం చేసుకుంటారని అన్నారు. వివిధ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు, ఆర్పీలు పాల్గొన్నారు.