News September 14, 2024

కళాకారులను ప్రజాప్రభుత్వం అదుకొంటుంది

image

తెలంగాణలోని పేద కళాకారులను తమ ప్రజాప్రభుత్వం అన్నివిధాలా అదుకొంటుందన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. శారద కథలు బలగం సినిమాలో నటించిన పేదకళాకారులు కొమురమ్మ, మొగిలయ్యలకు తన జీతం నుంచి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. పొన్నం సత్తయ్యగౌడ్ 14వ వర్ధంతి సందర్భంగా పలువురికి ఆయన స్మారక అవార్డులను మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణ రావు అందజేశారు.

Similar News

News September 28, 2024

HYD: స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి

image

నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఛాన్సలర్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.

News September 28, 2024

డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ దర్శనం క్యాన్సిల్ చేసుకున్నాడు: బండి

image

తిరుమల దర్శనం కోసం డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే ఏపీ మాజీ సీఎం జగన్ దర్శనాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రస్తుత పరిణామాలు, జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగానే లడ్డు అపవిత్రత అయిందని అనిపిస్తుందన్నారు.హిందూ మతంపై దాడి జరిగినప్పుడు కేవలం RSS, VHP లాంటి సంస్థలే పోరాడుతాయని ఊరుకుంటే సరిపోదని, ప్రతి ఒక్క హిందువు కొట్లాడాలన్నారు.

News September 28, 2024

జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు భారం తగ్గేలా చర్యలు

image

ఏళ్లుగా HYD నుంచి ఉత్పత్తి అయ్యే చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా దానికి భారం తగ్గించేందుకు GHMC ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో స్థలాలను గుర్తిస్తోంది. RRజిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో 42.22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారంలో 100, దుండిగల్‌లో 85, మల్కాపూర్‌లో 200ఎకరాలను గుర్తించింది.