News September 5, 2024
కళింగ టెంపుల్ సర్క్యూట్ ‘టూరిజం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

జిల్లాలోని పర్యాటక కేంద్రాలు, ప్రముఖ ఆలయాలను కలుపుతూ కళింగ టెంపుల్ సర్క్యూట్ టూరిజంను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. అందుకు తగ్గ ప్రతిపాదనలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పర్యాటక ప్రాజెక్టుల ప్రగతిపై సంబంధిత శాఖలతో కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. కళింగ టెంపుల్ సర్క్యూట్ టూరిజం ప్రసాదం పథకంకు ఎంపిక అయ్యేలా కేంద్ర మంత్రి సహకారం తీసుకుందామన్నారు.
Similar News
News December 5, 2025
నాకు బతకాలని లేదు: శ్రీకాకుళం యువతి సూసైడ్

విజయనగరం బీసీ హాస్టల్లో డిగ్రీ విద్యార్థిని సూసైడ్ కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు..VZM మహారాజ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్వాతి ఈ బలవన్మరణానికి పాల్పడింది. ఆమెది శ్రీకాకుళం(D)శ్రీకూర్మంగా పోలీసులు గుర్తించారు. తన డైరీలోని ఓ పేజీలో ‘అమ్మ.. నాన్నా నాకు బతకాలని లేదు. ఎందుకో భయమేస్తోంది. నేను ఏ తప్పు చేయలేదు’ అని స్వాతి రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 4, 2025
SKLM: ‘ప్రజలు సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత’

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడంపైనే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. సచివాలయం నుంచి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం కుసుమ పథకం కింద ఉన్న భూమి వివాదాలు, ఎరువులు సరఫరా లోపాలు, పెన్షన్ల పంపిణీలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు.
News December 4, 2025
ఈనెల 7న NMMS ప్రతిభా పరీక్ష: DEO

ఈనెల 7న NMMS ప్రతిభ పరీక్ష ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రవిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రెవెన్యూ డివిజన్లలోని 25 కేంద్రాల్లో పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షకు 5,627 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించాలని కోరారు.


