News February 24, 2025
కళ్యాణపులోవ పోతురాజుబాబు ఉత్సవాలకు వెళ్తున్నారా?

చీమలపాడు పంచాయతీ కళ్యాణపులోవ పోతురాజుబాబు ఆలయ ఉత్సవాలకు రద్దీ ఎక్కువైతే బైక్లు కూడా అనుమతించమని అనకాపల్లి డి.ఎస్.పి శ్రావణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దొండపూడి నుంచి పోతురాజుబాబు ఆలయం వరకు ఉన్న రోడ్డు వెడల్పు తక్కువగా ఉందన్నారు. దీని కారణంగా ఆ రోడ్డులో ఆటోలు, కార్లు, వ్యాన్లు అనుమతించమన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేయాలని భక్తులకు సూచించారు.
Similar News
News December 1, 2025
విధులకు గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు: కలెక్టర్

విధి నిర్వహణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్రజా వేదికకొచ్చే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాటిపై అవగాహన పెంచుకోవాలని అధికారులకు సూచించారు.
News December 1, 2025
అఫ్గాన్తో ట్రేడ్ వార్.. నష్టపోతున్న పాక్

అఫ్గాన్తో ట్రేడ్ వార్ పాక్ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఆ దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు ఆపేయడంతో పాక్లోని సిమెంట్ ఇండస్ట్రీ నష్టపోతోంది. అఫ్గాన్ నుంచి కోల్ దిగుమతి లేకపోవడంతో సౌతాఫ్రికా, ఇండోనేషియా, మొజాంబిక్ నుంచి అధిక ధరలకు సిమెంట్ ఫ్యాక్టరీలు బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాయి. 48 రోజుల నుంచి బార్డర్లు క్లోజ్ కావడంతో మందులు, అగ్రికల్చర్ గూడ్స్తోపాటు పండ్లు, కూరగాయల ఎగుమతులు నిలిచిపోయాయి.
News December 1, 2025
మేడారంలో ఏ చిన్న పొరపాటు జరిగినా చర్యలు తప్పవు: సీఎం

మేడారం జాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పనులలో ఏ చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. స్తపతి శివనాగిరెడ్డితో సమన్వయం చేసుకుంటూ, సంప్రదాయాలు పాటిస్తూ నిర్దేశిత సమయానికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్, రోడ్లు, భక్తుల విడిది, దర్శన ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు.


