News January 28, 2025

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన జగిత్యాల MLA

image

జగిత్యాల పట్టణంలోని ఓ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 202 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అటు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.19 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 22, 2025

రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలి: కలెక్టర్

image

రెవెన్యూ సేవల విషయంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీలోని 18వ సచివాలయంలో రెవెన్యూ సంబంధిత సేవలలో ఆలస్యాలు, ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. జనవరి నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజల నుంచి అందిన 332 దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు.

News October 22, 2025

కొత్తకోట: రెండు వాహనాలు ఢీ.. 8 మందికి గాయాలు

image

కొత్తకోట మండలం నాటవెల్లి-ముమ్మాలపల్లి గ్రామాల మధ్య NH- 44 పై బొలెరో, తుఫాన్ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాదు నుంచి పెబ్బేరు వైపు ప్రయాణికులతో వెళుతున్న తుఫాన్, కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న బొలెరోను ఢీకొంది. క్షతగాత్రుల్ని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News October 22, 2025

రాణీ అహల్యాబాయి.. అందరికీ ఆదర్శం

image

మాల్వాను పాలించిన రాణీ అహల్యాబాయి హోల్కర్ ఆదర్శ పాలకుల్లో ఒకరు. 1754లో జరిగిన కుంభేర్ యుద్ధంలో భర్త ఖండేరావు, 1767లో కుమారుడు మలేరావు మరణించడంతో 1795 వరకు ఇండోర్‌ను పాలించారు. అహల్యాబాయి పాలనాకాలం మరాఠా సామ్రాజ్యపు స్వర్ణయుగంగా గుర్తింపు పొందింది. ఎన్నో ప్రసిద్ధ హిందూ దేవాలయాలను ఆమె పునరుద్ధరించారు. అహల్యాబాయి కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఈమె పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పింది.