News December 17, 2024
కవ్వాల్లో అరుదైన పక్షులు
జన్నారం మండలంలోని కవ్వాల్ అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల బర్డ్, బటర్ ఫ్లై వాక్ నిర్వహించారు. కాగా అడవిలో పలు అరుదైన పక్షులు పర్యటకులకు కనువిందు చేశారు. రెడ్ రీసెల్డ్ ల్యాప్ విగ్, వైట్ ఐ బెజార్డ్, ఫైడ్ కింగ్ ఫిషర్, వైట్ త్రోటెడ్ కింగ్ ఫిషర్ వంటి పక్షులు కనిపించాయి. కవ్వాల్ పర్యాటకులను ఆకర్షిస్తోందని అధికారులు తెలిపారు.
Similar News
News January 16, 2025
ADB: మైనర్ను నమ్మించి అత్యాచారం చేశాడు..!
యువకుడిపై ADB పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. CI కర్ణాకర్ కథనం ప్రకారం.. ADBరిమ్స్లో చదువుతున్న బాలిక(17)కు INSTAGRAMలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులకు చెందిన శివ పరిచయమయ్యాడు. పెళ్లిచేసుకుంటానని నమ్మించడంతో ఈనెల 9న HYDవెళ్లగా ఆమెను ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు. ఆమె కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆచూకీ తెలుసుకొని ADBరప్పించి ఆమె వాంగ్మూలం తీసుకొని కేసువేశారు.
News January 16, 2025
ప్రజలు పోలీసు సేవలు వినియోగించుకోవాలి: నిర్మల్ SP
భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్డే నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కోరారు.
News January 16, 2025
సంక్షేమ పథకాలు అర్హులకే అందాలి: ADB కలెక్టర్
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జడ్పీ మీటింగ్ హాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పీవో ఖుష్బూ గుప్తా హాజరయ్యారు.