News February 5, 2025

కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

image

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్‌ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల, నిషేధంపై అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.

Similar News

News October 18, 2025

HYD నుంచి శ్రీశైలానికి గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం

image

HYD నుంచి శ్రీశైలానికి 147 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. రావిర్యాల నుంచి ఆమన్‌గల్, ఆమన్‌గల్ నుంచి మన్ననూరు వరకు దీనిని నిర్మించి, అక్కడి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా HMDA నిర్మిస్తోన్న రావిర్యాల-ఆమన్‌గల్ కొత్త రోడ్డును దీనికి అనుసంధానించనున్నారు.

News October 18, 2025

HYD నుంచి శ్రీశైలానికి గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం

image

HYD నుంచి శ్రీశైలానికి 147 కిలోమీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. రావిర్యాల నుంచి ఆమన్‌గల్, ఆమన్‌గల్ నుంచి మన్ననూరు వరకు దీనిని నిర్మించి, అక్కడి నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా HMDA నిర్మిస్తోన్న రావిర్యాల-ఆమన్‌గల్ కొత్త రోడ్డును దీనికి అనుసంధానించనున్నారు.

News October 18, 2025

ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు

image

AP: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 10,700 మంది సిబ్బందితో సన్నాహాలు చేస్తున్నాం. 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మిల్లర్లు పనిచేయాలి. ధాన్యం 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తాం’ అని తెలిపారు.