News February 5, 2025
కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల నిషేధంపై అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
వారంలో 100 టన్నులు అమ్మేశారు..

వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో దేశవ్యాప్తంగా ప్రజలు దీనిని ‘క్యాష్’ చేసుకున్నారు. ఇంట్లో ఉండే వెండిని భారీగా అమ్మేశారు. కేవలం వారంలోనే సుమారు 100 టన్నుల పాత వెండి మార్కెట్కు వచ్చినట్లు IBJA అంచనా వేసింది. సాధారణంగా నెలకు 10-15 టన్నులు మార్కెట్కు వచ్చేది. KG వెండి ధర రూ.1.90,000కు చేరుకోవడంతో లాభాల కోసం కుటుంబాలు దుకాణాలకు క్యూ కట్టాయి. పెళ్లిళ్లు, పండుగలు, ఖర్చులు కూడా అమ్మకాలకు ఓ కారణం.
News December 5, 2025
నెల్లూరు: 2.94 లక్షల చిన్నారులకు పోలియో చుక్కలే లక్ష్యం.!

నెల్లూరు జిల్లాలో ఈనెల 21వ తేదీన పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు ఉన్న 2,94,140 మంది చిన్నారులకు ఈ చుక్కల మందును వేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సన్నద్ధం అవుతోంది. జిల్లా వ్యాప్తంగా 52 PHC, 28 UPHCల పరిధిలో 80 కేంద్రాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించారు.
News December 5, 2025
వరి కోయ కాలు కాల్చితే భూమి నిర్వీర్యం: DAO

PDPL వ్యవసాయశాఖ రైతులకు కీలక సూచనలు జారీ చేసింది. వరి కోయ కాలు కాల్చడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు నశించి భూమి నిర్వీర్యమై పంట దిగుబడి తగ్గిపోతుందని DAO శ్రీనివాస్ స్పష్టం చేశారు. పంటావశేషాలను కాల్చకుండా సూపర్ పాస్ఫేట్ చల్లి నీరు పెట్టి దున్నితే సేంద్రియ పదార్థం పెరిగి ఎరువుల ఖర్చు తగ్గి, పంటల ఆరోగ్యం మెరుగవుతుందని సూచించారు. రైతులు ఈ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.


