News February 5, 2025
కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల నిషేధంపై అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.
Similar News
News February 9, 2026
అంబటి రాంబాబుకు బెయిల్

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో YCP నేత అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే మరో కేసులో ఇవాళ మధ్యాహ్నం స్పెషల్ జుడీషియల్ కోర్టు అంబటికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో మొదటి కేసులో బెయిల్ లభించినా ఆయన జైలు నుంచి బయటికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అటు రాష్ట్రవ్యాప్తంగా అంబటిపై 52 కేసులు నమోదైనట్లు సమాచారం.
News February 9, 2026
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: నిర్మల్ కలెక్టర్

జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలలో ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఓటర్ గుర్తింపు పత్రాల పంపిణీ పూర్తయ్యిందని, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామన్నారు. ఓటర్లు సౌకర్యవంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
News February 9, 2026
రెండేళ్లలో ఇద్దరు పిల్లలు.. తల్లులపై తీవ్ర ప్రభావం

వెంటవెంటనే ఇద్దరు పిల్లలను కనడం తల్లులపై తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి శరీరం పూర్తిగా కోలుకోకముందే మరోసారి గర్భం దాల్చడం వలన అలసట, రక్తహీనత, నిద్రలేమి, డిప్రెషన్ పెరుగుతుందని చెబుతున్నారు. ఇద్దరి పిల్లల మధ్య కనీసం 18 నెలల నుంచి 3 ఏళ్ల గ్యాప్ ఉంటే తల్లి ఆరోగ్యంగా ఉండటంతో పాటు తోబుట్టువుల మధ్య బాండ్ బలంగా ఉంటుందని సూచిస్తున్నారు.


