News February 5, 2025
కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్సిగ్నల్

కవ్వాల అభయారణ్యం పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాల రాకపోకలను అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు. రాకపోకలకు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాత్రి వేళల్లో రాకపోకలను అడ్డుకోవద్దని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వేటర్ను ఆదేశించారు. దీనిపై మంగళవారం HYDలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంత్రిని కలిశారు.
Similar News
News February 14, 2025
యాపల్గూడ బడి రాష్ట్రంలోనే బెస్ట్ స్కూల్: కలెక్టర్

యాపల్గూడ ప్రాధమిక పాఠశాలలో గురువారం బాల వికాస్ వాటర్ ప్లాంట్, లైబ్రరీలను కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు.ఈ సందర్భంగా రీడింగ్ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. రాష్ట్రంలోనే యాపల్గూడ బడి బెస్ట్ స్కూల్ అని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో DEO ప్రణీత, MEO నర్సయ్య, HM గంగయ్య, గ్రామ పెద్దలు, పేరెంట్స్, అధికారులు పాల్గొన్నారు.
News February 13, 2025
భీంపూర్లో చిరుత.. స్పందించిన అధికారులు

భీంపూర్ మండలంలోని నిపాని గ్రామ శివారులో చిరుత పులి కదలిక పై ఎఫ్ఎస్వో అహ్మద్ ఖాన్, ఎఫ్బీవో శ్రీనివాస్ స్పందించారు. నిపాని శివారులోని లింగారెడ్డి అనే రైతుకు చెందిన పంట చేనులో చిరుత పులి సంచారం సీసీ కెమెరాలో రికార్డయిందన్నారు. గురువారం పంట చేనుకు వెళ్లి పరిశీలించారు. రైతులెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News February 13, 2025
ADB: వ్యక్తిపై లైంగిక దాడి కేసు

తనను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ADB 1 టౌన్ CI సునీల్ కుమార్ వివరాలు.. తల్లిగారింటి వద్ద ఉంటున్న ఓ వివాహిత(24), శాంతినగర్కి చెందిన షేక్ ఆసిఫ్ 8నెలల పాటు సహజీవనం చేశారు. కాగా తనను ఆసిఫ్ మోసం చేశాడని, లైంగికంగా వేధించి తన వీడియోలు తీశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఆసిఫ్ తనను కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదైంది.