News March 23, 2025

కశింకోటలో యాక్సిడెంట్.. UPDATE

image

కశింకోట మండలం త్రిపురవానిపాలెం జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అనకాపల్లి నుంచి ఎలమంచిలి వైపు వెళుతున్న లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా అవతలి రోడ్డుకు వెళ్లడానికి లారీని మలుపు తిప్పాడు. అదే మార్గంలో వస్తున్న మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో వెనక లారీ డ్రైవర్ షేక్ మస్తాన్ వల్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు సీఐ స్వామి నాయుడు తెలిపారు.

Similar News

News October 30, 2025

మేడిపల్లి: కులం పేరుతో దూషించి దాడి.. వ్యక్తికి జైలు

image

మేడిపల్లి మండలం కల్వకోటకి చెందిన గోడ వెంకటిపై కులం పేరుతో దూషించి దాడి చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన ఆదె చందుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కరీంనగర్ మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి నీరజ తీర్పునిచ్చారు. 2020 జనవరి 21న బర్రెను ఢీకొట్టిన ఘటనపై మాటామాటా పెరిగి చందు వెంకటిని తిడుతూ దాడి చేశాడు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను SP అశోక్ కుమార్ అభినందించారు.

News October 30, 2025

మంచిర్యాల: ‘తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలి’

image

జిల్లాలోని రైతులు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయి ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చివరి దశలో నష్టపోతుండటంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. దీనితో ప్రతి సంవత్సరం అప్పుల పాలవుతున్నామని, తమను ఆదుకోవడానికి రాష్ట్రంలో తక్షణమే ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని రైతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News October 30, 2025

క్షేత్రస్థాయిలో పర్యటించిన బల్దియా కమిషనర్

image

గ్రేటర్ వరంగల్ పరిధిలోని వడ్డేపల్లి శ్యామల గార్డెన్స్ తదితర ప్రాంతాల్లో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానిక అధికారులు, ప్రజలతో కమిషనర్ మాట్లాడి వరద నీటి ప్రవాహ పరిస్థితులను స్వయంగా పరిశీలించి పలు సూచనలను చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.