News April 5, 2025
కశింకోట: పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నర్సింగిబిల్లి గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థిని పిల్లి బోయిన బ్యూలా ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 15, 2025
భద్రాద్రి జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు

భద్రాద్రి జిల్లాకు చేరిన చీరలను అశ్వారావుపేట, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలంలో ఆరు గోదాంలలో భద్రపరుస్తున్నామని డీఆర్డీవో విద్యాచందన తెలిపారు. ఇప్పటి వరకు 40శాతం జిల్లాకు చేరాయి. బతుకమ్మ నాటికి ఇండెంట్ పెట్టినవన్నీ వస్తే ఒక్కొక్కరికి రెండు చీరలు అందిస్తాము. లేకుంటే ఒక్కోటి పంపిణీ చేసి, తర్వాత మళ్లీ అందిస్తామన్నారు.
News September 15, 2025
VJA: వాట్సాప్లో కనకదుర్గమ్మ ఆర్జిత సేవల టికెట్లు

విజయవాడలో ఈ నెల 22 నుంచి OCT 2 వరకు జరగనున్న శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల టికెట్లను EO శీనానాయక్ ఆన్లైన్లో విడుదల చేశారు. https://kanakadurgamma.org/en-in/home, ప్రభుత్వ వాట్సప్ సేవల నంబర్ 9552300009లో ఈ టికెట్లు కొనుగోలు చేయవచ్చన్నారు. ఉత్సవాలకు హాజరుకాలేని వారు ఆన్లైన్లో ఆర్జితసేవలు చేయించుకునేందుకు రూ.1,500 చెల్లించి వీడియో లింక్ ద్వారా పూజలను వీక్షించవచ్చన్నారు.
News September 15, 2025
కృష్ణా: నేడు బాధ్యతలు స్వీకరించనున్న నూతన SP

కృష్ణా జిల్లా ఎస్పీగా నియమితులైన విద్యాసాగర్ నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11:30 గంటలకు ఆయన జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని పదవీ బాధ్యతలు చేపడతారు. ఇటీవల జరిగిన ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న విద్యాసాగర్ నాయుడును కృష్ణా జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.