News April 5, 2025
కశింకోట: పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నర్సింగిబిల్లి గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థిని పిల్లి బోయిన బ్యూలా ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 20, 2025
నార్సింగి: పల్లె ప్రకృతి వనమా.. డంపింగ్ యార్డా?

పచ్చని చెట్లు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. కానీ నార్సింగి మం. సంకాపూర్ పల్లె ప్రకృతి వనంలో పూర్తిగా చెత్త వేస్తూ అధ్వానంగా మారుస్తున్నారు. ప్రకృతి వనం ప్రక్కనే నివాస గృహాలు ఉండడంతో చెత్త వల్ల పాములు విపరీతంగా వస్తున్నాయని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు గ్రామస్థులు కోరుతున్నారు.
News November 20, 2025
CM పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

కొత్తగూడెం: CM రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొత్తగూడెంలోని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో ఏర్పాట్లను పరిశీలించారు. యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి CM రానున్నారని ఆయన తెలిపారు. అకాడమిక్ బ్లాక్, ఆడిటోరియం మరమ్మతులు, బాలుర మెస్, బాలికల హాస్టల్ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఆడిటోరియంలో మౌలిక వసతులు, సీటింగ్ ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
News November 20, 2025
చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్ బోర్డు ఎక్కువగా వాడతారు. కానీ దాని క్లీనింగ్పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్..* చాపింగ్బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి 5 నిమిషాలు నిమ్మ చెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది, 10 నిమిషాల తర్వాత నీటితో కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.


