News April 5, 2025
కశింకోట: పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం నర్సింగిబిల్లి గ్రామంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థిని పిల్లి బోయిన బ్యూలా ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 15, 2025
వనపర్తి: క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే

వనపర్తి జిల్లా అండర్ 14, 17 బాల, బాలికలకు నిర్వహించే ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్ అథ్లెటిక్స్ క్రీడలను బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే విద్యార్థుల ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 15 మండలాల నుంచి క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి విజేతలుగా నిలవాలని సూచించారు.
News October 15, 2025
వనపర్తి: రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు: మంత్రి

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి కలెక్టర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు ఏర్పాటుకు జిల్లాల వారీగా కలెక్టర్లు తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు.
News October 15, 2025
నారాయణపేట: లేబర్ కార్డులు అందివ్వాలి: CITU

నారాయణపేటలో భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తులు అందించారు. అర్హులైన కార్మికులు తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా పొందాలని సీఐటీయూ నాయకులు బాల్రామ్, పుంజనూరు ఆంజనేయులు పిలుపునిచ్చారు. కార్డు ఉన్న వారికి పెళ్లి, కాన్పు, మరణం వంటి సందర్భాల్లో ఆర్థిక సహాయం లభిస్తుందని అధికారులు తెలిపారు.