News March 19, 2025

కశింకోట: హత్యకు గురైంది హిజ్రాగా గుర్తించిన పోలీసులు

image

కసింకోట మండలం బయ్యవరం వద్ద హత్యకు గురైంది హిజ్రాగా పోలీసులు గుర్తించారు. మృతదేహంలో సగభాగాన్ని గోనె సంచులో పెట్టి బయ్యవరం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిపోయారు. మిగిలిన అవయవాలను అనకాపల్లి డైట్ కళాశాల ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. హత్యకు గురైంది ముందు మహిళగా పోలీసులు భావించారు. కాగా దర్యాప్తులో హిజ్రాగా నిర్ధారణ అయింది.

Similar News

News December 17, 2025

గంభీరావుపేట సర్పంచ్‌గా పద్మ విజయం

image

గంభీరావుపేట మండల కేంద్రం గ్రామ సర్పంచ్‌గా మల్లుగారి పద్మ ఘన విజయం సాధించారు. ఈ సందర్బంగా పద్మ మాట్లాడుతూ.. ఈ గెలుపును తన వ్యక్తిగత విజయంగా కాకుండా గంభీరావుపేట గ్రామ ప్రజలందరి విజయంగా భావిస్తున్నానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఆదరించి ఆశీర్వదించిన గ్రామస్థులందరికీ నూతన సర్పంచ్ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.

News December 17, 2025

వారసత్వంగా వచ్చిన ఇంటికి వాస్తు పాటించాలా?

image

వారసత్వంగా వచ్చిన ఇంటికీ వాస్తు నియమాలు పాటించాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. తద్వారా శుభ ఫలితాలు కొనసాగుతాయంటున్నారు. ‘మీ పేరు బలం, జన్మ నక్షత్రం, రాశి ఆధారంగా ఇంటి సింహద్వారం, ఇతర చిన్నపాటి మార్పులు చేసుకోవడం మంచిది. తద్వారా వారసత్వంగా వచ్చిన సుఖసంతోషాలు, సిరిసంపదలు అనుభవించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. లేదంటే, పరిస్థితులు మారి కష్టాలు రావచ్చు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 17, 2025

విద్యార్థుల సమస్యలపై స్పందించిన మంత్రి లోకేశ్

image

శీతాకాలం కావడంతో అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురుకుల, కేజీబీవీ హాస్టల్స్‌లో చదువుతున్న విద్యార్థులు చలికి వణికి స్కూల్స్‌కు వెళ్లేందుకు ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయం మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లింది. ఆయా హాస్టల్స్‌లోని స్టూడెండ్స్ ఆరోగ్య రీత్యా తగిన వసతులను కల్పించి, సమస్య పరిష్కరించాలని నేడు ‘X’ ఖాతా ద్వారా కలెక్టర్‌ను కోరారు.