News March 19, 2025

కశింకోట: హత్యకు గురైంది హిజ్రాగా గుర్తించిన పోలీసులు

image

కసింకోట మండలం బయ్యవరం వద్ద హత్యకు గురైంది హిజ్రాగా పోలీసులు గుర్తించారు. మృతదేహంలో సగభాగాన్ని గోనె సంచులో పెట్టి బయ్యవరం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిపోయారు. మిగిలిన అవయవాలను అనకాపల్లి డైట్ కళాశాల ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. హత్యకు గురైంది ముందు మహిళగా పోలీసులు భావించారు. కాగా దర్యాప్తులో హిజ్రాగా నిర్ధారణ అయింది.

Similar News

News November 7, 2025

నల్గొండ: తాను చనిపోయినా మరొకరికి వెలుగు!

image

నల్గొండ పట్టణం హైటెక్ సిటీ కాలనీకి చెందిన వైద్యం దయాకర్ గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ సభ్యులు దయాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి అనుమతితో దయాకర్ నేత్రాలు సేకరించారు. దయాకర్ నిడమనూరు మండలం ధర్మారం పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వహిస్తున్నారు. దయాకర్ తాను మరణించినప్పటికీ మరొకరికి వెలుగునిచ్చారని ఆయనను గుర్తుచేసుకుంటూ బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.

News November 7, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* ఆచార్య NG రంగా 125వ జయంత్యుత్సవాలకు హాజరుకానున్న CM చంద్రబాబు
* వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ప్రధాని పిలుపు మేరకు ఉ.9.50 గం.కు ప్రతి ఒక్కరం గేయాన్ని ఆలపిద్దాం: పవన్
* HYDలో జన్మించిన గజాలా హష్మీ వర్జీనియా గవర్నర్ కావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం: CM చంద్రబాబు
* పోలవరం ప్రాజెక్ట్‌పై ఆ ప్రాజెక్ట్ అథారిటీ రెండ్రోజుల సమీక్ష. నేడు HYDలోని కార్యాలయంలో, రేపు ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలన

News November 7, 2025

సెలవులు రద్దు: కడప DEO

image

సెలవులపై కడప DEO షంషుద్దీన్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్, 2026 ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం సెలవులు రద్దు చేశామని చెప్పారు. ఈ మూడు నెలల్లోని ఆయా శనివారాల్లో స్కూళ్లు ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ నేపథ్యంలో గత నెలలో వరుస సెలవులు ఇచ్చారు. ఈక్రమంలో ఈ మూడు సెలవులను వర్కింగ్ డేస్‌గా ప్రకటించారు.