News March 19, 2025
కశింకోట: హత్యకు గురైన ట్రాన్స్జెండర్ దీపుగా గుర్తింపు

హత్యకు గురైన ట్రాన్స్జెండర్ అనకాపల్లి పట్టణం గవరపాలెం బోయవీధికి చెందిన దీపు(30)గా గుర్తించారు. ఎంబీఏ చేసిన దిలిప్ కుమార్ దీపుగా మారింది. మూడేళ్ల నుంచి ఓ యువకుడితో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె మృతదేహంలో సగభాగాన్ని కసింకోట మండలం బయ్యవరం వద్ద మంగళవారం గుర్తించారు. అనకాపల్లి ఇన్ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Similar News
News December 7, 2025
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లో ఉద్యోగాలు

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(<
News December 7, 2025
12 రోజుల పాటు VIP బ్రేక్ దర్శనాలు రద్దు

AP: వివిధ పర్వదినాలను పురస్కరించుకొని DEC, JANలలో TTD 12 రోజులు VIP బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ‘DEC 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వైకుంఠ ఏకాదశి ముందు రోజైన DEC 29 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, JAN 25న రథసప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా VIP బ్రేక్ దర్శనాలు ఉండవు’ అని ప్రకటించింది. ఈ రోజులకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. భక్తులు సహకరించాలని కోరింది.
News December 7, 2025
కూరగాయల పంటల్లో వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు

వైరస్ తెగుళ్ల కట్టడికి రసం పీల్చే పురుగులను నివారించడం ముఖ్యం. అలాగే రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాల ఎంపిక, పంట మార్పిడి, అంతర పంటలను సాగు చేయాలి. పంట పొలం చుట్టూ జొన్న లేదా మొక్కజొన్న పంటలను కంచె పంటగా సాగు చేయాలి. కలుపు మొక్కలను తొలగించాలి. విత్తనం నాటే ముందు పొలానికి ట్రైకోడెర్మా, వేపపిండి కలిపి వేయడం, గుళికలమందు వాడకం, విత్తనశుద్ధి మంచి ఫలితాలిస్తాయి.


