News March 19, 2025

కశింకోట: హత్యకు గురైన ట్రాన్స్‌జెండర్ దీపుగా గుర్తింపు

image

హత్యకు గురైన ట్రాన్స్‌జెండర్‌ అనకాపల్లి పట్టణం గవరపాలెం బోయవీధికి చెందిన దీపు(30)గా గుర్తించారు. ఎంబీఏ చేసిన దిలిప్ కుమార్ దీపుగా మారింది. మూడేళ్ల నుంచి ఓ యువకుడితో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె మృతదేహంలో సగభాగాన్ని కసింకోట మండలం బయ్యవరం వద్ద మంగళవారం గుర్తించారు. అనకాపల్లి ఇన్‌ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Similar News

News December 13, 2025

జగిత్యాల: ఏం చేశారని విజయోత్సవాలు: విద్యాసాగర్ రావు

image

ఏం చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ హాయాంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయని, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా అభివృద్ధి కనబడటం లేదని అన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే రవి శంకర్, దావ వసంత ఉన్నారు.

News December 13, 2025

ఈనెల 14 నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు: CMD

image

ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించాలని APEPDCL సీఎండీ పృథ్వీ తేజ్ సిబ్బందికి ఆదేశించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించాలని శనివారం కోరారు. కళాశాల విద్యార్థులకు వర్క్‌షాప్‌లు, పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు.

News December 13, 2025

కొంతమంది సీడీపీవోలు డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్నారు: అశోక్

image

ఐసీడీఎస్ హైర్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ సమావేశం శనివారం స్థానిక DRDA మీటింగ్ హాలులో జరిగింది. రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ హాజరయ్యారు. కొంతమంది సీడీపీవోలు సొంత వాహనాలను ఉపయోగించి బిల్లులు డ్రా చేసుకుంటూ డ్రైవర్ల ఉపాధిపై దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు.