News May 10, 2024
కాంగ్రెస్తోనే పాతబస్తీ అభివృద్ధి: CM రేవంత్ రెడ్డి

గొడవలు సృష్టించే MIMకు ఓటు వేయొద్దని, వ్యాపారాలు అభివృద్ధి చేసే INCకి ఓటు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి గోషామహల్ పరిధి బేగంబజార్ ఛత్రిలో హైదరాబాద్ MP అభ్యర్థి సమీర్ ఉల్లావల్లితో కలిసి CM ప్రచారం నిర్వహించారు. గత పదేళ్లుగా BJP మూసీ నదిని శుద్ధి చేయాలేదన్నారు. BRS కనీసం ఉస్మానియాను కూడా బాగుచేయలేదని విమర్శించారు. ఓల్డ్ సిటీ మెట్రో కాంగ్రెస్తోనే సాధ్యమని పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
HYD: నేడు కార్గో వస్తువుల వేలం

HYDలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో పెండింగ్లోని కార్గో, పార్సిల్ వస్తువులకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జోన్ లాజిస్టిక్ మేనేజర్ బద్రి నారాయణ తెలిపారు. MGBSలోని పార్సిల్ గోడౌన్ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని కోరారు.
News November 22, 2025
HYD: KPHBలో విదేశీ యువతులతో వ్యభిచారం.. జైలు శిక్ష

KPHB PS పరిధిలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహించిన నిర్వాహకుడికి కూకట్పల్లి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి ముఠాను అరెస్ట్ చేశారు. నిర్వాహకుడు రిపాన్తో పాటు బంగ్లాదేశ్ యువతులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు. సివిల్ జడ్జి సంధ్యారాణి విచారణ చేపట్టి శిక్ష ఖరారు చేసి తీర్పు ఇచ్చారు.
News November 22, 2025
HYD: బీసీ కమిషన్ రిపోర్ట్కు కేబినెట్ ఆమోదం

తెలంగాణలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నివేదిక ఆధారంగా పంచాయతీ రాజ్ శాఖ నేడు జీవోను విడుదల చేయనుంది. జిల్లా కలెక్టర్లు నవంబర్ 23వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆదేశించారు. పూర్తి నివేదికను పంచాయతీ రాజ్ శాఖ నవంబర్ 24వ తేదీన కోర్టుకు సమర్పించనుంది. ఈ నిర్ణయం ద్వారా రిజర్వేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నారు.


