News March 20, 2025
కాంగ్రెస్తోనే సాధ్యమైన ఎస్సీ వర్గీకరణ: మంత్రి

మూడు దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంత్రిని ఆందోలు నియోజకవర్గ దళిత కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో గురువారం కలిసి సన్మానించారు. కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాణిక్యం, నాయకులు గణపతి, సుధాకర్, నగేష్, కృష్ణ, లక్ష్మణ్, పాల్గొన్నారు.
Similar News
News February 23, 2026
సిరిసిల్ల గ్రీవెన్స్ డేలో 27 ఫిర్యాదులు

బాధితుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి 27 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.
News February 23, 2026
సిరిసిల్ల: డ్రంకెన్ డ్రైవ్.. 20 రోజుల్లో 364 కేసులు..!

సిరిసిల్ల కార్గిల్ లేక్ వద్ద సోమవారం నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో డీఎస్పీ నాగేంద్రచారి పాల్గొన్నారు. గత 20 రోజుల్లో సబ్ డివిజన్ పరిధిలో 364 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తామన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతిరోజూ తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు.
News February 23, 2026
కర్ణాటక హైకోర్టుకు రణ్వీర్ సింగ్

తనపై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేయాలని కోరుతూ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అర్జెంట్ హియరింగ్ చేపట్టాలన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకని.. పిటిషనర్ బాలీవుడ్ స్టార్ కాబట్టి విచారణ వేగవంతం చేయాలా? అని జస్టిస్ నాగప్రసన్న ప్రశ్నించారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. కాంతారలో దైవాన్ని కించపరిచారంటూ <<18988013>>రణ్వీర్పై<<>> కేసు నమోదైంది.


