News February 2, 2025
కాంగ్రెస్లోని రెడ్లకే టికెట్లు ఇస్తే బీసీ కులగణన ఎందుకు?: జాజుల

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని టికెట్లు రెడ్లకే కేటాయించడాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బీసీ కులగణన చేసి ఎవరి వాటా వారికిస్తామని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు నీటి మూటలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ చెప్పేదొకటి, చేసేదొకటని.. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్లకు టికెట్లు ఇవ్వడమే నిదర్శనమన్నారు.
Similar News
News January 19, 2026
ఏలూరు: ‘పబ్లిక్ గ్రీవెన్స్కు 35 అర్జీలు’

ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్కు 35 అర్జీలు అందాయని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పేపర్ లెస్ పద్ధతిలో నిర్వహించామన్నారు. ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునే వారు https://meekosam.ap.gov.in వెబ్సైట్ను ఉపయోగించుకోవాలని సూచించారు.
News January 19, 2026
VJA: అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు

ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత 16 రోజులకు గాను హుండీ లెక్కింపు నిర్వహించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.2,60,86,479 నగదు ఆదాయం వచ్చింది. అదనంగా 135 గ్రాముల బంగారం, 2 కిలోల 858 గ్రాముల వెండి లభించాయి. అమెరికా, యూరోప్, యూఏఈ, కెనడా తదితర దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
News January 19, 2026
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు

బెంగళూరులోని <


