News March 29, 2024

కాంగ్రెస్ కరీంనగర్ టికెట్ ఎవరికి?

image

కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఖరారుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నెల 31న నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు పేర్లు వినిపించగా.. కొత్తగా తీన్మార్ మల్లన్న పేరు తెరమీదకు వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ KNR, సిరిసిల్ల, సిద్దిపేట, HNK డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను తీసుకున్నట్లు తెలిసింది. బరిలో నిలిచేదెవరో కామెంట్?

Similar News

News February 12, 2026

కౌంటింగ్‌ వేళ అప్రమత్తంగా ఉండాలి: సీపీ గౌష్‌ ఆలం

image

కరీంనగర్‌ జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌ యంత్రాంగం సిద్ధమైంది. నగరంలోని అస్త్ర కన్వెన్షన్‌ హాలులో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్‌లో పోలీసు అధికారులకు, సిబ్బందికి సీపీ గౌష్‌ ఆలం దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకుండా నిఘా ఉంచాలన్నారు.

News February 12, 2026

కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ టాప్

image

కరీంనగర్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపాలిటీ 81.47 శాతం పోలింగ్ నమోదు చేసి జిల్లాలో టాప్‌గా నిలిచింది. జమ్మికుంటలో 79.81%, చొప్పదండిలో 78.76%, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 62.98% పోలింగ్ నమోదైంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్‌లో 77.8% పోలింగ్ నమోదు కాగా, ఈసారి ఏకంగా 3.67 శాతం పెరిగింది. అధిక ఓటింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

News February 12, 2026

కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ టాప్

image

కరీంనగర్ జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపాలిటీ 81.47 శాతం పోలింగ్ నమోదు చేసి జిల్లాలో టాప్‌గా నిలిచింది. జమ్మికుంటలో 79.81%, చొప్పదండిలో 78.76%, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 62.98% పోలింగ్ నమోదైంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్‌లో 77.8% పోలింగ్ నమోదు కాగా, ఈసారి ఏకంగా 3.67 శాతం పెరిగింది. అధిక ఓటింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.