News May 31, 2024

కాంగ్రెస్ కుట్రను భగ్నం చేస్తాం: మల్కాజిగిరి MLA

image

తెలంగాణ రాజముద్రపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని BRS మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. మల్కాజిగిరిలో ఆయన గురువారం మాట్లాడుతూ.. కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక గుర్తులు కాదని, అవి మన తెలంగాణ చరిత్రకు గుర్తులన్నారు. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సంకుచిత నిర్ణయాలపై సమర శంఖం పూరించి ప్రజా ఉద్యమం చేస్తామన్నారు.

Similar News

News September 21, 2024

HYDలో RELAX అంటూ వ్యభిచారం

image

RELAX అంటూ ఆన్‌లైన్‌లో అశ్లీల ఫొటోలు పంపి HYD‌ యువకులను ఆకర్షిస్తున్న వ్యభిచార ముఠా బాగోతం వెలుగుచూసింది. నెల్లూరు వాసి వంశీకృష్ణ, HYDకు చెందిన పార్వతి కలిసి ఈ దందాకు తెరలేపారు. ఆన్‌లైన్‌లో అశ్లీల చిత్రాలు పెట్టి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు రేట్‌ ఫిక్స్ చేసి వ్యభిచారం నిర్వహించారు. నిఘాపెట్టిన CYB AHTUకి వీరికి చెక్ పెట్టింది. గతంలోనూ వీరు ప్రాస్టిట్యూషన్‌ కేసులో అరెస్ట్ అయ్యారు.

News September 21, 2024

HYD: ఇండోర్, లక్నోకు వెళ్లిన మేయర్, కార్పొరేటర్లు

image

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు శుక్రవారం జీహెచ్ఎంసీ స్టడీ టూర్‌కి వెళ్లారు. స్టడీ టూర్‌లో భాగంగా ఇండోర్, లక్నో ప్రాంతాలకు వెళ్లి అక్కడ పలు విషయాలపై అధ్యయనం చేయనున్నారు. ఆయా మెట్రో నగరాల్లో కొనసాగుతున్న చేపట్టిన పలు వివిధ విధానాలను, అంశాలను పరిశీలించనున్నారు. అనంతరం వాటిని గ్రేటర్ పరిధిలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

News September 21, 2024

HYD: విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: సీఎండీ

image

నూతన విద్యుత్ కనెక్షన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అధికారులను హెచ్చరించారు. ఉన్నతాధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతివారం అధికారులు ఒకరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో చేపట్టిన పనులు డిసెంబర్ నాటికి వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.