News July 25, 2024
కాంగ్రెస్ తొలి బడ్జెట్.. కరీంనగర్ ఆశిస్తుందిదే..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ఇవాళ శాసనసభలో ప్రవేశ పెడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఈ పద్దుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పథకాలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా కేటాయింపులు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. సిరిసిల్ల JNTU బిల్డింగ్, గల్ఫ్ వెళ్లిన వారి సంక్షేమం , వస్త్రోత్పత్తి, ఆహార శుద్ధి పరిశ్రమ స్థాపన ప్రస్తావన ఉంటుందని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
Similar News
News December 10, 2025
అవినీతి రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్ పమేలా సత్పతి

అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్లో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అవినీతి వ్యతిరేక దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. అవినీతి రహిత సమాజం మనందరి లక్ష్యం కావాలని ఆమె పేర్కొన్నారు.
News December 9, 2025
కరీంనగర్ ఆర్టీసీ వన్ డే టూర్ ప్యాకేజీ

ఆర్టీసీ కరీంనగర్-1 డిపో ప్రత్యేక వన్ డే టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు డి.ఎం. విజయమాధురి తెలిపారు. ఈ ప్యాకేజీలో బీదర్ జలా నరసింహస్వామి, బీదర్ పోర్టు, జరాసంగం, రేజింతల్ సందర్శన ఉంటుంది. ఈ నెల 14న ఉదయం 3:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి కరీంనగర్కు చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.1,400, పిల్లలకు రూ.1,080గా నిర్ణయించారు. ఆసక్తి గలవారు డిపోలో సంప్రదించాలని సూచించారు.
News December 9, 2025
మెదటి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది: కలెక్టర్

గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికలకు 9వ తేది సా. 5 గంటల నుంచి ప్రచారానికి తెరపడనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్కు 44 గంటల ముందు నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ఉల్లంఘనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


